Trendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 పల్నాడు జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍కృష్ణా జిల్లా

Raithusamasyalanu MLA రైతు సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చిన రైతులు

Krishna:పెడన, అక్టోబర్ 22:-పెడన నియోజకవర్గంలోని రైతులు తమ సమస్యలను పెడన శాసనసభ్యులు కాగిత కృష్ణ ప్రసాద్ గారికి వివరించారు. బంటుమిల్లి ప్రధాన కాలువ పరిధిలోని పెడన, బంటుమిల్లి, కృత్తివెన్ను మండలాల్లో విస్తరించిన సాగు భూములు ఎక్కువగా చౌడు భూములే కావడంతో, ఈ భూముల్లో వరి పంట తప్ప ఇతర పంటలు సాగు చేయడం సాధ్యం కాదని రైతులు తెలిపారు.రైతుల ఆవేదన ప్రకారం, గత ఐదేళ్లుగా కృష్ణా పరివాహక ప్రాంతంలో రెండో పంట దాళ్వా కోసం సాగునీరు విడుదల చేయకపోవడంతో భూములు నిరుపయోగంగా మారాయి. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ కాలంలోనూ నాలుగేళ్ల పాటు రెండో పంట సాగుకు నీరు ఇవ్వకపోవడంతో, భూముల సారం తగ్గి దిగుబడులు పడిపోయాయని రైతులు వాపోయారు.

దీంతో కౌలు రైతులు నష్టపోతున్నారని, కౌలు బస్తాలు కూడా తగ్గిపోతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. రెండో పంట లేకపోవడంతో వేలాది ఎకరాల సాగు భూములు చేపలు, రొయ్యల చెరువులుగా మారిపోతున్నాయని రైతులు తెలిపారు.ప్రస్తుతం నీరు సమృద్ధిగా లభిస్తున్న నేపథ్యంలో ఈ సంవత్సరం రెండో పంట దాళ్వాకు సాగునీరు విడుదల చేయాలని రైతులు ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ గారిని కోరారు. రైతుల అభ్యర్థనను ఎమ్మెల్యే శ్రద్ధగా విన్నారు.ఈ సందర్భంగా రైతులతో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు, నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button