
విజయవాడ, ఫిబ్రవరి 10, 2026:-ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అస్యూరెన్స్ కమిటీ చైర్మన్, కైకలూరు నియోజకవర్గ శాసనసభ్యులు డా. కామినేని శ్రీనివాస్ మంగళవారం విజయవాడ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు సృజన చౌదరి క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన కీలక సమావేశంలో పాల్గొన్నారు.

రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు పీ.వి.ఎన్. మాధవ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో బీజేపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. త్వరలో ప్రారంభం కానున్న రాష్ట్ర శాసనసభ సమావేశాల నేపథ్యంలో సభలో అనుసరించాల్సిన కార్యాచరణపై విస్తృతంగా చర్చించారు.
ఈ సందర్భంగా రాష్ట్ర అభివృద్ధి, సుపరిపాలన, ప్రజల సమస్యలు, వారికి అందుతున్న సంక్షేమ పథకాల అమలు అంశాలపై శాసనసభలో గట్టిగా మాట్లాడాలని నిర్ణయించారు. అభివృద్ధే లక్ష్యంగా శాసనసభలో బలమైన స్వరం వినిపించాలని నేతలు ఏకాభిప్రాయానికి వచ్చారు.

ఈ సమావేశంలో వివిధ నియోజకవర్గాలకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ ప్రముఖులు తదితరులు పాల్గొని తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు.Vijayawada Localnews










