Trendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా

Vijayawada Local News:రెండవ దశ భూ సమీకరణ రాజధాని అభివృద్ధి కోసమే-ఎపీ సోషల్ వెల్ఫేర్ బోర్డు చైర్మన్ బాలకోటయ్య

విజయవాడ: నవంబర్ 29:-రాజధాని అభివృద్ధిని వేగవంతం చేయాలనే లక్ష్యంతోనే రెండో దశ భూ సమీకరణ చేపడుతున్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సామాజిక సంక్షేమ బోర్డు చైర్మన్ పోతుల బాలకోటయ్య స్పష్టం చేశారు. శనివారం విజయవాడ ప్రెస్ క్లబ్‌లో విలేకరులతో మాట్లాడిన ఆయన, ప్రజల రాజధానిని మరింత విస్తృతంగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ముందడుగు వేసిందన్నారు.

అమరావతి పరిధిలోని ఏడు గ్రామాల్లో 16,666 ఎకరాలను రైతుల సమ్మతితో, మొదటి విడత మోడల్‌లోనే సమీకరిస్తున్నట్లు వివరించారు. రాజధాని అంశంపై వైసీపీ మరియు ఆ పార్టీకి చెందిన జె.మీడియా తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయంటూ మండిపడ్డారు. *“గత అయిదేళ్లలో అమరావతికి పట్టెడు మెతుకులు పెట్టని వారికి ఇప్పుడు రాజధాని గురించి మాట్లాడే అర్హత లేద”*ని వ్యాఖ్యానించారు.ముఖ్యమంత్రి చంద్రబాబు నాటిన మొక్కలను వైఎస్ జగన్ ప్రభుత్వం పీకేసిందని, వేసిన రోడ్లను త్రవ్వి తీసుకెళ్లారని ఎద్దేవా చేశారు. అమరావతి పేరు చెబితే వైసీపీకి గిట్టదని, అందుకే అసత్యాలు ప్రచారం చేస్తోందని విమర్శించారు.రాజధాని ప్రాంత రైతుల సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం కట్టుబడి ఉందని బాలకోటయ్య తెలిపారు. ఇందుకోసం కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఆధ్వర్యంలో త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేయడం ప్రభుత్వం నిబద్ధతకు నిదర్శనమని చెప్పారు. మొదటి విడత గానీ, రెండో విడత గానీ రాజధాని కోసం భూమి ఇచ్చిన ఏ రైతుకూ నష్టం జరగదని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ సభ్యులు గంథం సంపత్ కుమార్, రెల్లి సంక్షేమ సంఘం నాయకులు శిరంశెట్టి నాగేంద్రరావు, అమరావతి రైతు నాయకులు కుమ్మరి కోటేశ్వరరావు, అమరావతి బహుజన ఐకాస నాయకులు మామిడి సత్యం, వజ్రాల రవిశంకర్ తదితరులు పాల్గొన్నారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker