Trendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 పల్నాడు జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍గుంటూరు జిల్లా

Retaier janurilistulaku pension రిటైర్డ్ జర్నలిస్టులకు పెన్షన్ ఇవ్వాలని సీఎం చంద్రబాబుకు వినతి

Guntur:మంగళగిరి: అక్టోబర్ 19 :-ఆంధ్రప్రదేశ్ వెటరన్ జర్నలిస్టుల యూనియన్ ప్రతినిధులు శనివారం మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయం ఎన్టీఆర్ భవన్‌లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు‌ను కలిసి రిటైర్డ్ జర్నలిస్టులకు పెన్షన్ పథకాన్ని అమలు చేయాలని కోరారు.జర్నలిస్టుగా కనీసం 20 సంవత్సరాల అనుభవం కలిగి, 58 సంవత్సరాలు పూర్తి చేసినవారు రాష్ట్రంలో 500 మందికి మించి ఉండరని, కాబట్టి ఈ పథకం వల్ల ప్రభుత్వానికి పెద్ద ఆర్థిక భారం ఉండదని వారు తెలిపారు. దేశంలోని 19 రాష్ట్రాలలో ఇప్పటికే ఈ పథకం అమలులో ఉందని చెప్పారు.

ఇతర రాష్ట్రాలలో జర్నలిస్టులకు ఇస్తున్న పెన్షన్ వివరాలు, సంబంధిత జీవోలు తదితర వివరాలతో కూడిన వినతిపత్రాన్ని ముఖ్యమంత్రికి సమర్పించారు. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు సానుకూలంగా స్పందించి, విషయం పరిశీలిస్తామని హామీ ఇచ్చారు.ముఖ్యమంత్రిని కలిసిన వారిలో యూనియన్ గౌరవాధ్యక్షులు శిరందాసు నాగార్జునరావు, జనరల్ సెక్రటరీ జి. చంద్రశేఖర్, ఉపాధ్యక్షులు కాకర్ల వెంకటరత్నం, జి. రామారావు, ట్రెజరర్ ఎం.పీ. రామారావు తదితరులు ఉన్నారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button