Trendingఅనకాపల్లిఅనంతపురంఅన్నమయ్యఅమరావతిఅల్లూరి సీతారామరాజుఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్ఎన్టీఆర్ విజయవాడఏలూరుకర్నూలుకాకినాడకృష్ణాకోనసీమగుంటూరుచిత్తూరుజాతీయ వార్తలుటెక్నాలజితిరుపతితూర్పుగోదావరితెలంగాణదినఫలాలునందజ్యోతినంద్యాలనెల్లూరుపల్నాడుపశ్చిమగోదావరిప్రకాశంబాపట్లమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవిజయనగరంవిశాఖపట్నంవెదర్ రిపోర్ట్వైయస్సార్ కడపశ్రీకాకుళంశ్రీసత్యసాయిస్పోర్ట్స్హైదరాబాద్
పల్నాడుఆంధ్రప్రదేశ్

RO plant inaugurated at Government Lal Bahadur Municipal High School

నరసరావుపేట పట్టణంలోని తొమ్మిదో వార్డులో గల ప్రభుత్వ లాల్ బహదూర్ మున్సిపల్ హై స్కూల్‌లో విద్యార్థులకు స్వచ్ఛమైన మంచినీటిని అందించేందుకు నూతనంగా నిర్మించిన ఆర్‌ఓ ప్లాంట్‌ను శనివారం ప్రారంభించారు. ఈ ఆర్‌ఓ ప్లాంట్ నిర్మాణానికి డాక్టర్ శాఖమూరి బాజీ బాబు, డాక్టర్ రామచంద్ ఆర్థిక సహకారం అందించగా, దీనిని పునర్నిర్మాణం చేశారు.ఈ సందర్భంగా నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు ముఖ్య అతిథిగా పాల్గొని, “సుపరిపాలన తొలి అడుగు” కార్యక్రమంలో భాగంగా ఆర్‌ఓ ప్లాంట్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆయన విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తూ, స్వచ్ఛమైన మంచినీటి ప్రాముఖ్యతను వివరించారు. ఆర్‌ఓ ప్లాంట్ నిర్మాణానికి సహకరించిన డాక్టర్ శాఖమూరి బాజీ బాబు, డాక్టర్ రామచంద్‌లను ఎమ్మెల్యే అభినందించారు.కార్యక్రమంలో టీడీపీ పల్నాడు జిల్లా కార్యదర్శి అల్లంశెట్టి మోహన్ రావు, సీనియర్ నాయకులు వాసిరెడ్డి రవి, పోక రత్తయ్య, నాదేండ్ల గాంధీ, షేక్ హర్షద్, జల సూత్రం సృజన, డాక్టర్ షీర్ సాహెబ్ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం విద్యార్థులకు సురక్షితమైన మంచినీటిని అందించడంలో ముఖ్యమైన మైలురాయిగా నిలిచింది.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button