chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 మహబూబ్‌నగర్ జిల్లా📍 మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
తెలంగాణ📍 హైదరాబాద్ జిల్లా

ఆరెస్సెస్ శతాబ్దోత్సవాలు ప్రారంభం: శక్తి తో పాటు సేవా భావం అవసరం – లింగం శ్రీధర్ జీ

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 21:
రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆరెస్సెస్) శతాబ్దోత్సవాల సందర్భంగా, ఆదివారం సాయంత్రం సీతారాం బాగ్‌లోని శ్రీ జగన్నాథ మఠంలో ఘనంగా ప్రారంభ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రచారక్ లింగం శ్రీధర్ జీ పాల్గొని, సంఘ సిద్ధాంతాల ప్రాధాన్యతను వివరించారు.

“శక్తి లేని వ్యక్తి శవంతో సమానం,” అని స్పష్టం చేసిన ఆయన, “శక్తితో పాటు సంస్కారం, సమర్పణ, సేవాభావం కూడా ప్రతి ఒక్కరిలో ఉండాలి,” అని పిలుపునిచ్చారు.


ఆరెస్సెస్ శతాబ్దోత్సవాలు ప్రారంభం: శక్తి తో పాటు సేవా భావం అవసరం – లింగం శ్రీధర్ జీ

వెయ్యి ప్రాంతాల్లో శతాబ్దోత్సవాలు – దసరా నాటికి లక్ష్యంగా

లింగం శ్రీధర్ జీ ప్రకటన మేరకు, జంట నగరాల్లోని వెయ్యికి పైగా ప్రాంతాల్లో ఈ శతాబ్దోత్సవాలను నిర్వహించేందుకు సంఘం కార్యాచరణ సిద్ధం చేసింది. “గడపలోపల కులం, గడప దాటితే మేమంతా హిందువులం” అంటూ సామాజిక సమైక్యతకు ఓ స్పష్టమైన సందేశాన్ని ఇచ్చారు.

పర్యావరణ పరిరక్షణపై మాట్లాడిన ఆయన, ప్రజలందరూ ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలని సూచించారు.


“100 ఏళ్ల సేవా యాత్ర” – డా. లక్ష్మీనారాయణ

ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఉస్మానియా మెడికల్ కళాశాల ప్రొఫెసర్ డా. అనుపురం లక్ష్మీనారాయణ మాట్లాడుతూ, “గత 100 సంవత్సరాలుగా ఆరెస్సెస్ దేశానికి అనేక రంగాల్లో విశేష సేవలు అందించింది,” అని పేర్కొన్నారు.


ధర్మరక్షణకు ప్రతిజ్ఞ – జగన్నాథ మఠాధిపతి

శ్రీ జగన్నాథ మఠ పీఠాధిపతి శ్రీ శ్రీ శ్రీ అచ్యుత రామానుజాచార్య స్వామీజీ మాట్లాడుతూ, “మానవజీవితం సంపూర్ణంగా మారాలంటే తల్లిదండ్రులను పూజిస్తూ, ధర్మరక్షణకు పాటుపడాలి,” అని అన్నారు. రాబోయే 15 సంవత్సరాలు దేశ భవిష్యత్తు దృష్ట్యా అత్యంత కీలకమని ఆయన అభిప్రాయపడ్డారు.


సంప్రదాయాలతో కూడిన సందేశాల మధ్య, ఆరెస్సెస్ శతాబ్దోత్సవాల ప్రారంభం గంభీరంగా సాగింది.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker