ప్రభుత్వ ప్రాధాన్యత సర్వేలన్నింటిని వేగవంతం చేయాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు తెలిపారు. నోడల్ అధికారులు కార్యదర్శులు చేస్తున్న సర్వేల పై ప్రత్యేక దృష్టి సారించాలని అడ్మిన్ కార్యదర్శులు, నోడల్ అధికారులను ఆదేశించారు. మంగళవారం నగర పాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని కౌన్సిల్ సమావేశ మందిరం నందు సచివాలయాల కార్యదర్శులు మరియు నోడల్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమీషనర్ తొలుత కార్యదర్శుల వారీగా మిస్సింగ్ సిటిజెన్స్, పి.ఏ.సి.యస్, హౌసింగ్ జియో ట్యాగ్, యన్.పి.సి.ఐ, నాన్ రెసిడెంట్ ఇన్ ఏ.పి, యం.యస్.యం. ఈ సర్వే ల పురోగతి పై వివరాలడిగి తెలుసుకొని, మాట్లాడుతూ సర్వేల వేగవంతం పై కార్యదర్శులు, నోడల్ ఆఫీసర్లు ప్రత్యేక దృష్టి సారించి గురువారం నాటికి పూర్తి చేయాలన్నారు. ఇక నుండి సర్వేలను మరియు సచివాలయాలను ఆకస్మిక తనిఖీలు చేస్తామని, ప్రజలకు జవాబుదారీతనంగా ఉంటూ మెరుగైన సేవలను అందించాలన్నారు. విధుల్లో నిర్లక్ష్యంగా ఉండేవారిపై ఖటిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం సిటిజెన్ డేటాబేస్ ను సిద్దం చేయడానికి, సూక్ష్మ, మధ్యతరగతి వ్యాపార సంస్థలకు రాష్ట్ర మరియు కేంద్ర సంక్షేమ పధకాలు అమలు చేయడానికి సర్వేలు చేస్తున్నామన్నారు. సర్వేకు నగర ప్రజలు పూర్తి స్తాయిలో సహకరించి సచివాలయ కార్యదర్శులకు తగిన సమాచారం ఇచ్చి సహకరించాలని కోరారు.
Read Next
5 hours ago
GUNTUR NEWS: స్వర్ణాంధ్ర – స్వచ్చంద్రాలో భాగంగా ఈ-వ్యర్ధాల నిర్వహణపై కార్యక్రమం
1 day ago
GUNTUR NEWS: ప్రస్తుత డిజైన్తో ఇక్కట్లు తప్పవు – శంకర్ విలాస్ ఫ్లై ఓవర్ డిజైన్ మార్చాలి
1 day ago
GUNTUR NEWS: పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజనపై సదస్సు
With Product You Purchase
Subscribe to our mailing list to get the new updates!
Lorem ipsum dolor sit amet, consectetur.
Related Articles
Check Also
Close