chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍గుంటూరు జిల్లా

Guntur Local News :సామ్నా ప్రధాన లక్ష్యం చిన్న పత్రికల ఐక్యతే- సామ్నా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్. రమణారెడ్డి

గుంటూరు:-రాష్ట్రవ్యాప్తంగా ఉన్న చిన్న, మధ్యతరగతి పత్రికలను ఒకే వేదికపైకి తీసుకువచ్చి వాటి హక్కులు, సమస్యల పరిష్కారానికి కృషి చేయడమే ‘స్టేట్ స్మాల్ అండ్ మీడియం న్యూస్ పేపర్స్ అసోసియేషన్ (సామ్నా)’ ప్రధాన లక్ష్యమని సామ్నా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్. రమణారెడ్డి స్పష్టం చేశారు.శనివారం గుంటూరులో నిర్వహించిన సామ్నా గుంటూరు జిల్లా నూతన కమిటీ ఎంపిక సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. 2018లో ఏపీయూడబ్ల్యూజే అనుబంధంగా సామ్నా ఏర్పడిందని, చిన్న పత్రికలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి దివంగత అంబటి ఆంజనేయులు ఈ సంఘాన్ని స్థాపించారని ఆయన గుర్తు చేశారు.సామ్నా రాష్ట్ర అధ్యక్షులు నల్లి ధర్మారావు కృషితో సంఘం స్థిరపడిందని, అలాగే ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు ఐ.వి. సుబ్బారావు సంకల్పం, మార్గదర్శకత్వంతో సామ్నా మరింత పటిష్టంగా ముందుకు సాగుతోందని తెలిపారు. ఐ.వి. సుబ్బారావు నాయకత్వంలో అన్ని కమిటీలను సమర్థవంతంగా ఏర్పాటు చేసి సామ్నాను బలోపేతం చేశారని పేర్కొన్నారు.ఈ క్రమంలో భాగంగానే సామ్నా గుంటూరు జిల్లా నూతన కమిటీని ఎంపిక చేసినట్లు తెలిపారు. ఈ సమావేశాన్ని ఏపీయూడబ్ల్యూజే గుంటూరు జిల్లా అధ్యక్షులు ఎస్.ఎన్. మీరా, జిల్లా కార్యదర్శి కే. రాంబాబు ప్రత్యేక చొరవతో నిర్వహించారు.ఈ సందర్భంగా ఏపీయూడబ్ల్యూజే గుంటూరు జిల్లా కార్యదర్శి కే. రాంబాబు మాట్లాడుతూ, రాష్ట్ర బాధ్యుల ఆదేశాల మేరకు సామ్నా గుంటూరు జిల్లా కమిటీ నిర్మాణం కోసం ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. అనంతరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్. రమణారెడ్డి సామ్నా లక్ష్యాలు, భవిష్యత్ కార్యాచరణ, చిన్న పత్రికల అభివృద్ధికి చేపట్టబోయే కార్యక్రమాలను వివరించారు.

Guntur Local News :సామ్నా ప్రధాన లక్ష్యం చిన్న పత్రికల ఐక్యతే- సామ్నా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్. రమణారెడ్డి

గుంటూరు జిల్లా నూతన కమిటీ ప్రకటనసమావేశం అనంతరం సామ్నా గుంటూరు జిల్లా నూతన కమిటీని అధికారికంగా ప్రకటించారు.జిల్లా అధ్యక్షులు: వెన్నపూస దశరథరామిరెడ్డి (మాట కోసం)జిల్లా కార్యదర్శి: సిహెచ్. శ్రీనివాసరావుఉపాధ్యక్షులు: మౌలాలి (ప్రతి నిమిషం)సంయుక్త కార్యదర్శి: వహీద్ భాషా (బలగం న్యూస్)కోశాధికారి: ఎల్. వెంకటేశ్వరరావు (తెనాలి టైమ్స్)

Guntur Local News :సామ్నా ప్రధాన లక్ష్యం చిన్న పత్రికల ఐక్యతే- సామ్నా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్. రమణారెడ్డి

ఈసీ సభ్యులుగా:ఎం. శ్రీనివాసరావు (ప్రోగ్రెస్ న్యూస్)పి. దేవానంద్ మొనగాడు (పక్షపత్రిక)బాలాజీ సింగ్ (మన కళాశాల వారపత్రిక)నూతనంగా ఎన్నికైన జిల్లా కమిటీ సభ్యులు సామ్నా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్. రమణారెడ్డిని, అలాగే ప్రజాభీష్టం దినపత్రిక ఎడిటర్ ఎం.వి. సుబ్బారావును శాలువాలతో ఘనంగా సన్మానించారు.Guntur Local Newsఈ సమావేశంలో గుంటూరు జిల్లా నలుమూలల నుంచి వచ్చిన చిన్న పత్రికల సంపాదకులు, పబ్లిషర్లు, జర్నలిస్టులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నూతన కమిటీకి జర్నలిస్టులు అభినందనలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఐజేయు మాజీ నాయకులు మార్కండేయులు, ఏపీయూడబ్ల్యూజే గుంటూరు జిల్లా అధ్యక్షులు ఎస్.ఎన్. మీరా, జిల్లా కార్యదర్శి కే. రాంబాబు, జిల్లా కమిటీ సభ్యులు పరశ్యం నాయక్, గుంటూరు నగర కమిటీ అధ్యక్ష–కార్యదర్శులు వెంకయ్య, కార్తీక్, కమిటీ సభ్యులు రఘునాథరెడ్డి, వివిధ పత్రికల ఎడిటర్లు, పబ్లిషర్లు, జర్నలిస్టులు పాల్గొన్నారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker