chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍గుంటూరు జిల్లా

Guntur Local News :శాస్త్రీయ దృక్పథం అలవరచుకోవాలి– జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా

గుంటూరు:డిసెంబరు 22 :-విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథం అవసరమని, అది చిన్న వయసు నుంచే అలవర్చుకోవాలని జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా అన్నారు. ప్రభుత్వ బాలుర ఉర్దూ పాఠశాలలో విద్యా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన విద్యా, వైజ్ఞానిక ప్రదర్శన (సైన్స్ ఫెయిర్) ముగింపు కార్యక్రమంలో ఆయన సోమవారం పాల్గొని మాట్లాడారు.

Guntur Local News :శాస్త్రీయ దృక్పథం అలవరచుకోవాలి– జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా

సైన్స్ ఫెయిర్‌ల ద్వారా విద్యార్థుల్లో సృజనాత్మకత, శాస్త్రంపై ఆసక్తి పెరుగుతుందని కలెక్టర్ తెలిపారు. ఒక అంశాన్ని స్పష్టంగా అర్థం చేసుకోవడానికి శాస్త్రీయ దృక్పథం ఎంతో అవసరమని పేర్కొన్నారు. ఉన్నత చదువులు, పోటీ పరీక్షల్లో విజయం, శాస్త్రవేత్తగా ఎదగాలంటే శాస్త్రీయ ఆలోచన తప్పనిసరిగా ఉండాలన్నారు. శాస్త్రీయ దృక్పథం కలిగినవారు జీవితంలో ముందుకు సాగుతారని చెప్పారు.

విద్యార్థులను ప్రోత్సహిస్తున్న ఉపాధ్యాయులను కలెక్టర్ అభినందించారు. పిల్లల విజయం తల్లిదండ్రులకు ఆనందం కలిగిస్తుందని, ఇదే ఉత్సాహంతో వారి భవిష్యత్తుకు బలమైన పునాదులు వేయాలని సూచించారు

విద్యారంగంలో ప్రభుత్వం పలు సంస్కరణలు అమలు చేస్తోందని, ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేట్ పాఠశాలలకంటే మెరుగ్గా ఉన్నాయని అన్నారు. ఫౌండేషన్ స్థాయిలో చదవడం, రాయడం, అర్థం చేసుకోవడం అంశాలపై సర్వే జరుగుతోందని, విద్యార్థుల సమగ్ర అభ్యసనాన్ని నమోదు చేస్తూ హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డులు అందిస్తున్నామని తెలిపారు. సమ్మెటివ్, ఫార్మేటివ్ అసెస్మెంట్ పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు.

ఉన్నత పాఠశాలలకు ప్రత్యేక అధికారులు

జిల్లాలో ఉన్నత పాఠశాలలకు ప్రత్యేక అధికారులను నియమించామని, పదవ తరగతిలో శత శాతం ఉత్తీర్ణత సాధించే దిశగా ప్రణాళికాబద్ధంగా చర్యలు చేపట్టామని కలెక్టర్ వెల్లడించారు. 185 ఉన్నత పాఠశాలల్లో “మన బడి – మన బాధ్యత” కార్యక్రమాన్ని అమలు చేస్తూ విద్యా ప్రమాణాలు మెరుగుపరచడంతో పాటు ఉన్నత అవకాశాలపై అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు.

లక్ష్యాలను నిర్దేశించుకోవాలి

విద్యార్థులు స్పష్టమైన లక్ష్యాలను ఏర్పాటు చేసుకుని, వాటి సాధనకు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ సూచించారు.Guntur Local News

జిల్లా విద్యాశాఖ అధికారి డా. షేక్ సలీం భాషా మాట్లాడుతూ విద్యా, వైజ్ఞానిక ప్రదర్శనలను వ్యక్తిగతంగా, బృందాల వారీగా నిర్వహించామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఉత్తమ ప్రదర్శనలకు బహుమతులు అందజేశారు. ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker