అభివృద్ధికిచిరునామా తెలుగుదేశంప్రభుత్వం: ఏపీ ప్రభుత్వం విప్పు వెంకటరావు!
జిల్లా గన్నవరం,నున్న లో పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావ్**అభివృద్ధికి చిరునామా తెలుగుదేశం ప్రభుత్వం**గుంతలు లేని రహదారుల రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్దాం*అభివృద్ధి కి చిరునామా తెలుగుదేశం ప్రభుత్వమని ప్రభుత్వ విప్, గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావ్ అన్నారు. విజయవాడ రూరల్ నున్నలో పలు అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించారు. 28 లక్షల నిధులతో నున్న జిల్లా పరిషత్ పాఠశాల లైబ్రరీ, అలాగే గ్రౌండ్ చదును చేసే పనులకు శంకుస్థాపన చేశారు . అలానే 51.90 లక్షలు , 14 లక్షల నిధులతో నిర్మించిన రెండు రోడ్లను ఆయన ప్రారంభించారు. ఎన్టీఆర్ 29 వ వర్థంతిని పురస్కరించుకొని నున్న లో ఎన్టీఆర్ విగ్రహాన్ని ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ గన్నవరం నియోజకవర్గంలో రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి పనులు చేస్తున్నామని వెల్లడించారు. గుంతలు లేని రోడ్లు కార్యక్రమం చేపట్టే స్థితికి గత ప్రభుత్వం తీసుకువచ్చిందని విమర్శించారు. రాష్ట్ర వ్యాప్తంగా గుంతలు లేని రహదారులను నిర్మించామని వెల్లడించారు. విద్యకు మంత్రి నారా లోకేష్ ప్రాధాన్యత ఇస్తున్నారని ఇందులో భాగంగా ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పథకాన్ని అమలు చేసారని గుర్తు చేశారు. చదువులో మాత్రమేకాకుండా ఆటలోను విద్యార్థులు రాణించాలని పాఠశాలలను అభివృద్ధి చేస్తున్నారని చెప్పారు. అనంతరం ఎన్టీఆర్ వర్థంతి సందర్భంగా మాట్లాడుతూ పేదవాడికి కూడు, గూడు , గుడ్డ అనే నినాదంతో అన్న నందమూరి తారకరామారావు తెలుగుదేశంపార్టీని స్థాపించారని అన్నారు. పార్టీ పెట్టిన తొమ్మిది నెలల్లోనే అధికారం చేపట్టి ముఖ్యమంత్రిగా అనేక సంక్షేమ పథకాలు అమలు చేసి సంక్షేమ పథకాలకు ఆద్యుడిగా నిలిచారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు , అభిమానులు కార్యకర్తలు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.