
చీరాల: స్థానిక సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీలో సివిల్ ఇంజినీరింగ్ విభాగం ఆధ్వర్యంలో “అప్లికేషన్ ఆఫ్ అడ్వాన్స్డ్ టూల్స్ ఇన్ ల్యాండ్ సర్వే” (Applications of Advanced Tools in Land Surveying) అనే అంశంపై వారం రోజుల వర్క్షాప్ ఘనంగా ప్రారంభమైంది. ఈ శిక్షణా కార్యక్రమాన్ని కళాశాల సెక్రటరీ వనమా రామకృష్ణారావు, కరస్పాండెంట్ శ్రీమంతుల లక్ష్మణరావు సంయుక్తంగా ప్రారంభించారు. మార్చి 16 నుంచి ప్రారంభమైన ఈ వర్క్షాప్ వారం రోజుల పాటు బి.టెక్ విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వనుంది.

విజయవాడకు చెందిన ప్రముఖ సంస్థ ‘యునిక్ సర్వే సొల్యూషన్స్’ సహకారంతో, ఆ సంస్థ ప్రతినిధి ప్రేమ్ కుమార్ ఆధ్వర్యంలో ఈ శిక్షణ కొనసాగుతోంది. ఇందులో భాగంగా టోటల్ స్టేషన్, ట్రింబుల్, జియోమాక్స్, డీజీపీఎస్ వంటి అత్యాధునిక ల్యాండ్ సర్వే పరికరాల పనితీరుపై విద్యార్థులకు అవగాహన కల్పించడమే కాకుండా, క్షేత్రస్థాయిలో ప్రాక్టికల్ శిక్షణ కూడా అందిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ డా. కె. జగదీష్ బాబు మాట్లాడుతూ.. ప్రస్తుత కాలంలో సివిల్ ఇంజినీరింగ్ రంగంలో అత్యాధునిక ల్యాండ్ సర్వే టూల్స్కు ఎంతో ప్రాధాన్యత ఉందని, వీటిపై పట్టు సాధిస్తే విద్యార్థులకు అద్భుతమైన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమానికి సి.హెచ్. ప్రేమ్ కుమార్ కోఆర్డినేటర్గా వ్యవహరిస్తున్నారు. ప్రారంభోత్సవ వేడుకలో డా. సి. సుబ్బారావు, వనమా దొర నాగ సాయినాద్, వివిధ విభాగాల అధ్యాపకులు మరియు పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.http://BAPATLA NEWS







