chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 మహబూబ్‌నగర్ జిల్లా📍 మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
తెలంగాణ📍 హైదరాబాద్ జిల్లా

సికింద్రాబాద్ లో వరద ముంపు ప్రాంతాల్లో మాజీ మంత్రుల పర్యటన

సికింద్రాబాద్, సెప్టెంబర్ 21:ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా ముంపు పరిస్థితులు నెలకొన్న రాంగోపాల్ పేట్ ప్రాంతాన్ని మాజీ మంత్రులు హరీష్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్ సందర్శించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన వారు బాధితులకు నిత్యావసర సరుకులను అందజేశారు.

ఈ సందర్భంగా మాట్లాడిన హరీష్ రావు, వరద బాధితులకు సహాయం అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని తీవ్రంగా విమర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మున్సిపల్ శాఖ తన వద్దే ఉంచుకున్నప్పటికీ, పాలనలో సౌలభ్యం అందించడంలో విఫలమయ్యారని అన్నారు.

సికింద్రాబాద్ లో వరద ముంపు ప్రాంతాల్లో మాజీ మంత్రుల పర్యటన

తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ, తాను వ్యక్తిగతంగా పేద ప్రజలకు సహాయం చేయడం ద్వారా బాధితులకు అండగా నిలిచానని, ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కొనాలని హితవు పలికారు. వరదల మూలంగా ప్రజలు ఇళ్లను కోల్పోవడానికి ప్రభుత్వ నిర్లక్ష్యం ప్రధాన కారణమని పేర్కొన్నారు.

ముఖ్యమంత్రి వైఖరి, అతని హోదాకు తగిన విధంగా లేదని విమర్శించిన హరీష్ రావు, వెంటనే వరద ముంపు ప్రాంతాల్లో ఆర్థిక సహాయం, నిత్యావసరాల పంపిణీ చేపట్టాలని, అలాగే నాలాల పూడికతీత పనులను తక్షణమే ప్రారంభించాలని డిమాండ్ చేశారు.

ఇక కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లిన ఎమ్మెల్యేలను ఉద్దేశిస్తూ, “బహిరంగంగా పార్టీ కండువా మార్చుకుని, పార్టీ మారలేదనడం సిగ్గుచేటు” అని మండిపడ్డారు.

బతుకమ్మ పండుగను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం నిధులు విడుదల చేయాలని, మౌలిక వసతుల కల్పనపై దృష్టి పెట్టాలని కోరారు. గ్రామ పంచాయతీలకు నిధులు లేక గ్రామాలలో పాలన కుంటుపడుతోందని హరీష్ రావు ఆందోళన వ్యక్తం చేశారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker