Trendingఅనకాపల్లిఅనంతపురంఅన్నమయ్యఅమరావతిఅల్లూరి సీతారామరాజుఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్ఎన్టీఆర్ విజయవాడఏలూరుకర్నూలుకాకినాడకృష్ణాకోనసీమగుంటూరుచిత్తూరుజాతీయ వార్తలుటెక్నాలజితిరుపతితూర్పుగోదావరితెలంగాణదినఫలాలునందజ్యోతినంద్యాలనెల్లూరుపల్నాడుపశ్చిమగోదావరిప్రకాశంబాపట్లమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవిజయనగరంవిశాఖపట్నంవెదర్ రిపోర్ట్వైయస్సార్ కడపశ్రీకాకుళంశ్రీసత్యసాయిస్పోర్ట్స్హైదరాబాద్
గుంటూరు

“సేవా సామ్రాట్” అవార్డును అందుకున్న మందా వెంకట్రావు

వినుకొండ :- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భాషా సాంస్కృతి శాఖ వారి సౌజన్యంతో శ్రీ చౌడేశ్వరి గొడుగుల మహోత్సవం సందర్భంగా శ్రీ దత్త సాయి కళాపరిషత్ ఆధ్వర్యంలో కడప జిల్లా,జమ్మలమడుగు లోని మైలవరం గ్రామంలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలలో విశిష్ట అతిథిగా పాల్గొన్న, ఉత్తమ సేవాకళా రత్న అవార్డు గ్రహీత, జీవనజ్యోతి స్వచ్ఛంద సేవా సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ మందా వెంకట్రావు ని కళాపరిషత్ అధ్యక్షులు ఎం .సి .ఆది రెడ్డి ఘనంగా సత్కరిస్తూ సేవా సామ్రాట్ బిరుదును ప్రధానం చేశారు .
ఈ సందర్భంగా ఆది రెడ్డి మాట్లాడుతూ మందా వెంకట్రావు జాషువా పద్యాలతో ప్రజలను ఆకట్టుకున్నారని వారు రాష్ట్ర కళాకారుల అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నారని కొనియాడారు, మందా వెంకట్రావు మాట్లాడుతూ కడప జిల్లాలోని కళాకారులు మన భారత సంస్కృతి సంప్రదాయాలను కొనసాగిస్తూ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి, ప్రజలను చైతన్య పరుస్తు డటం చాలా అభినందనీయమని రాష్ట్రంలోని పేద కళాకారులను ప్రభుత్వం ప్రత్యేక నిధులతో ఆదుకోవాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు సూపర్ సిక్స్ సూపర్ హిట్ ,లాంటి కార్యక్రమాలు ప్రజల్లోకి కళా ప్రదర్శనల ద్వారా చేరవేసే విధంగా కళాకారులకు ఉపాధి అవకాశం కల్పించాలని గ్రామదర్శిని, జన్మభూమి తాలూకు పాత బిల్లులు త్వరగా విడుదల చేయాలని కోరుతూ త్వరలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ని కలిసి కళాకారుల స్థితిగతుల గూర్చి విజ్ఞప్తి చేసి తప్పకుండా సాధించే విధంగా కృషి చేస్తానని మందావెంకట్రావు తెలియజేశారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button