Trendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍బాపట్ల జిల్లా

uccessful 3 Programs: Shakti App Awareness on Safety, Anti-Drugs, and POCSO Act in Chirala||విజయవంతమైన 3 కార్యక్రమాలు: చీరాలలో Shakti App తో భద్రత, డ్రగ్స్ వ్యతిరేకత, పోక్సో చట్టంపై Shakti App అవగాహన

uccessful 3 Programs: Shakti App Awareness on Safety, Anti-Drugs, and POCSO Act in Chirala||విజయవంతమైన 3 కార్యక్రమాలు: చీరాలలో Shakti App తో భద్రత, డ్రగ్స్ వ్యతిరేకత, పోక్సో చట్టంపై Shakti App అవగాహన

బాపట్ల ఎస్పీ బి. ఉమామహేశ్వరరావు ఐపిఎస్ ఆదేశాల మేరకు చీరాల డిఎస్పి మోయిన్ సూచనల మేరకు శక్తి టీం ఎస్సై హరిబాబు ఆధ్వర్యంలో వేటపాలెం మండలంలోని నాయనిపల్లి వెస్ట్, ఈస్ట్ మరియు ఓఆర్ఎస్ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల లలో పిల్లలు, బాలికలు, యువత భద్రతను పెంపొందించేందుకు శక్తి యాప్ వినియోగంపై, మాదక ద్రవ్యాల ప్రమాదాలపై “డ్రగ్స్ వద్దు బ్రో” ప్రచారం, అలాగే పోక్సో చట్టంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పోలీసు అధికారులు విద్యార్థులకు శక్తి యాప్ ఉపయోగం, అత్యవసర సహాయం పొందే విధానం, మహిళలు,బాలికల రక్షణకు ప్రభుత్వం అందిస్తున్న సేవలను వివరించారు. అకస్మాత్తుగా జరిగే ప్రమాదాల్లో, వేధింపుల్లో, అత్యవసర పరిస్థితుల్లో వెంటనే సహాయం కోసం శక్తి యాప్ ఎంత ఉపయుక్తమో విద్యార్థులకు వివరించారు.
అలాగే పోలీసు అధికారులు “డ్రగ్స్ వద్దు బ్రో” పేరిట మాదక ద్రవ్యాల దుష్ప్రభావాలను చైతన్యపరిచారు. నేటి యువతలో పెరుగుతున్న డ్రగ్స్ వినియోగం చదువు, ఆరోగ్యం, భవిష్యత్తు నాశనం చేస్తుందని చెప్పారు. చీరాల పట్టణంలో డ్రగ్స్ పై నిఘా మరింత బలోపేతం చేయనున్నట్లు వెల్లడించారు.
కార్యక్రమంలో పోక్సో చట్టం పై కూడా విద్యార్థులకు విపులంగా అవగాహన కల్పించారు. బాలలపై లైంగిక నేరాలకు కఠిన శిక్షలు ఉన్నాయని, ఏ రకమైన వేధింపులకు గురైన వెంటనే పోలీసులకు లేదా శిశు సంరక్షణ కమిటీకి ఫోన్ చేసి తెలియజేయాలని సూచించారు. బాలికలు మాత్రమే కాదు, బాలుర రక్షణ కూడా ఈ చట్టం ద్వారా సమానంగా లభిస్తుందని అధికారులు తెలిపారు. పోలీసు శాఖ ప్రతినిధులు మాట్లాడుతూ,
“సాంకేతిక యుగంలో పిల్లల భద్రత అత్యంత ముఖ్యమైన విషయం. శక్తి యాప్‌ను ప్రతి మహిళ, యువతి తప్పనిసరిగా ఉపయోగించాలి. డ్రగ్స్ అనే మహమ్మారిని సమాజం నుండి పూర్తిగా తరిమేయాలంటే ప్రతి విద్యార్థి, ప్రతి కుటుంబం జాగ్రత్తగా ఉండాలి. పోక్సో చట్టంపై ఉన్న అవగాహన, బాధ్యత అందరికీ ఉండాలి” అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులు, ఉపాధ్యాయులు పోలీసు శాఖ చేపట్టిన ఈ మూడు కార్యక్రమాలు మహిళా భద్రత, మాదక ద్రవ్యాల నిర్మూలన, బాలల రక్షణ చట్టాలు సమాజానికి ఎంతో అవసరమని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు కర్ణ. వీరప్రసాద్, టి. శోభాదేవి, ఎం. నిర్మలాదేవి మరియు ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker