వేటపాలెం మండలం రామన్నపేట పంచాయతీ పరిధిలో ఉన్న బాపయ్య నగర్ నందు ఇంట్లో డొక్కా శ్రావణి అనే మహిళ ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన శనివారం వెలుగు చూసింది. మృతదేహాన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఎస్సై జనార్దన్ సంఘటన స్థలానికి చేరుకొని సంఘటన జరిగిన తీరును పరిశీలించారు. మృతదేహాన్ని స్థానిక ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
https://www.instagram.com/reel/DK2Fno_O8uL/?utm_source=ig_web_copy_link&igsh=c3Y4MHRqY25mbG82