chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 మహబూబ్‌నగర్ జిల్లా📍 మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా

Sri Durga Malleshwara Swamy:శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల భక్తులకు విజ్ఞప్తి – కార్తీక మాసం చివరి రోజులలో ప్రత్యేక దర్శన ఏర్పాట్లు

NTRవిజయవాడ: ఇంద్రకీలాద్రి :14-11-25:-కార్తీక మాసం చివరి వారాంతం కావడంతో ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం వద్ద భారీ భక్తజనం రద్దీ ఉండనున్నట్లు దేవస్థానం అధికారులు అంచనా వేస్తున్నారు. నవంబర్ 14, 15, 16 (శుక్రవారం, శనివారం, ఆదివారం) తేదీల్లో ప్రత్యేకంగా ఎక్కువ మంది భక్తులు దర్శనార్ధం తరలివచ్చే అవకాశముండడంతో ముందస్తు చర్యలు చేపట్టారు.కార్తీక మాసం ఈ నెల 20-11-2025తో ముగియనుండటంతో, వానభోజనాలు, వనసమారాధన కార్యక్రమాలు నిర్వహించుకునే భక్తులు అమ్మవారి దర్శనానికి పెద్ద సంఖ్యలో రావొచ్చని అధికారులు తెలిపారు.

ప్రత్యేక ఏర్పాట్లు – మార్పులు ఇవే:నవంబర్ 14, 15, 16 తేదీల్లో ఉదయం 11:00 నుండి మధ్యాహ్నం 2:30 వరకురూ. 500 ప్రత్యేక దర్శనం టిక్కెట్ల విక్రయం తాత్కాలికంగా నిలిపివేత.ఇదే సమయాల్లో VIP సిఫార్సు లేఖలకు అనుమతి ఉండదు.రద్దీని నియంత్రించేందుకు ఈ మూడు రోజులలో ఉదయం 11.00–మధ్యాహ్నం 2.30 మధ్య భక్తులందరికీ బంగారు వాకిలి ద్వారా దర్శనం కల్పించనున్నట్లు దేవస్థానం స్పష్టం చేసింది.

భక్తుల సౌకర్యార్థం తీసుకున్న ఈ మార్పులను గమనించి సహకరించాలని దేవస్థానం విజ్ఞప్తి చేసింది.ఈ వివరాలను దేవస్థానం చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, ఈఓ వి.కె. శీనా నాయక్ తెలియజేశారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker