Trendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 పల్నాడు జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍తిరుపతి జిల్లా

Srikalahastiswaralayamloశ్రీకాళహస్తీశ్వరాలయంలోరాహు–కేతు పూజలు నిర్వహించిన కల్వకుంట్ల కవిత

Tirupati:శ్రీకాళహస్తి, అక్టోబర్ 19:శ్రీకాళహస్తీశ్వరాలయంలో రాహు–కేతు దోష నివారణ పూజలను తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కుటుంబ సభ్యులతో కలిసి ఆదివారం నిర్వహించారు. సహస్రలింగం వద్ద రూ.5 వేల విలువైన ప్రత్యేక రాహు–కేతు, కాలసర్ప దోష నివారణ పూజల్లో ఆమె పాల్గొన్నారు.దక్షిణ గోపురం వద్ద మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి స్వాగతం పలికారు. అనంతరం స్వామి, అమ్మవార్ల ఆలయాల్లో అంతరాలయ దర్శనం చేశారు. వేదపండితులు ప్రత్యేక ఆశీర్వచనం అందించగా, ఆలయ అధికారులు స్వామి అమ్మవారి చిత్రపటం, తీర్థప్రసాదాలు అందజేశారు.

తరువాత మీడియాతో మాట్లాడిన కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ అక్టోబర్ 25 నుంచి “జాగృతి జనం బాట” కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నట్లు తెలిపారు. నాలుగు నెలలపాటు ఈ కార్యక్రమం కొనసాగనున్నదని, దీని విజయవంతం కోసం శ్రీకాళహస్తీశ్వరాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించామని వివరించారు.ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని, రాబోయే దీపావళి సందర్భంగా రెండు రాష్ట్రాల ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో మాజీ ధర్మకర్తల మండలి చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button