Sriram Dhanunjay (Chinnababu) presenting CM Relief Fund cheques to the victims.
ఎన్టీఆర్ జిల్లా, జగ్గయ్యపేట పట్టణానికి చెందిన కూర్మాల రాధాకృష్ణ అదేవిధంగా జిడుగు లక్ష్మీపతి లు ఇటీవలే అనారోగ్యంతో బాధపడుతూ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స చేయించుకొని చికిత్స అనంతరం డిచ్చార్జ్ అయిన తర్వాత బిల్లులను ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ తాతయ్య సిఫార్సు లెటర్ ద్వారా ముఖ్యమంత్రి సహాయ నిధికి అప్లై చేయగా సోమవారం ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి మంజూరైన చెక్కులను కూర్మాల రాధాకృష్ణ 46,150/- అదేవిధంగా జిడుగు లక్ష్మీపతి 30,000/- వేల రూపాయల చెక్కులను ఈరోజు శాసనసభ్యులు శ్రీరాం రాజగోపాల్ తాతయ్య నివాసంలో వారి సోదరులు శ్రీరాం ధనుంజయ్ చిన్నబాబు చేతుల మీదుగా బాధితుల కుటుంబ సభ్యులకు అందజేశారు
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి, ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ తాతయ్యకి బాధితులు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో గింజుపల్లి రమేష్, మేక వెంకటేశ్వర్లు, ఏలూరి గోపాలరావు, తాళ్లూరి వెంకటేశ్వర్లు, మారెపల్లి భాషా,సయ్యద్ అన్వర్, తూమాటి కృష్ణ, ముత్యాల శేషగిరి రావు తదితరులు పాల్గొన్నారు