Trendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍గుంటూరు జిల్లా

శ్రీశైలం దేవస్థానం ట్రస్ట్‌కు ఏవీ రమణ ఎంపిక

మంగళగిరి, అక్టోబర్ 7 : తెలుగుదేశం పార్టీ నేత, పార్టీ కార్యక్రమాల కోఆర్డినేటర్ ఏవీ రమణను శ్రీశైలం దేవస్థానం ట్రస్ట్ బోర్డు సభ్యునిగా నియమించిన సందర్భంగా మంగళవారం మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా సత్కరించారు. పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు విగ్రహం వద్ద దేశం తమ్ముళ్లు ఆయనకు పూలమాలలు వేసి, శాలువాతో సత్కరించి, పూల మొక్కను అందజేశారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, పార్టీ ఆవిర్భావం నుంచి రమణ పార్టీ అభివృద్ధికి నిరంతరంగా సేవలందిస్తున్నారని ప్రశంసించారు. ఒక సమయంలో హైదరాబాద్ టీడీపీ కార్యాలయంలో, ప్రస్తుతం అమరావతిలోని కేంద్ర కార్యాలయంలో సమర్థవంతంగా పార్టీ కార్యక్రమాల నిర్వహణలో రమణ కీలక పాత్ర పోషిస్తున్నారని కొనియాడారు. శ్రీశైలం దేవస్థానం అభివృద్ధికి ఆయన సేవలు మరింత ఉపయోగపడాలని ఆకాంక్షించారు.

సత్కార కార్యక్రమంలో కాపు సంఘం రాష్ట్ర కార్యదర్శి విన్నకోట శ్రీనివాసరావు, టీడీపీ బీసీ సెల్ జిల్లా కార్యదర్శి చీకుల వెంకటేశ్వరరావు, నేతలు మల్లాది శ్రీనివాస్, ఆళ్ల శ్రీనివాసరావు, షేక్ ఇంతియాజ్, సాహెషా తదితరులు పాల్గొన్నారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button