
బాపట్ల :- నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టీడీపీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన “సుపరిపాలనలో తొలి అడుగు” కార్యక్రమాన్ని మై టీడీపీ యాప్ ద్వారా విజయవంతంగా అమలు చేసిన కార్యకర్తలకు తగిన గుర్తింపుగా ప్రశంసాపత్రాల ప్రదాన కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో బాపట్ల నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ వేగేశన నరేంద్ర వర్మ రాజు గారు పాల్గొని కార్యకర్తలకు స్వయంగా ప్రశంసాపత్రాలు అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే నరేంద్ర వర్మ రాజు గారు మాట్లాడుతూ, టెక్నాలజీని సమర్థవంతంగా వినియోగిస్తూ ముందుగా గుర్తింపు పొందిన కార్యకర్తలతో పాటు, ప్రతి కార్యకర్త కూడా పార్టీకి బలమని తెలిపారు. పార్టీ కోసం శ్రమిస్తున్న ప్రతి ఒక్కరికీ విడతలవారీగా న్యాయం జరుగుతుందన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు.
వచ్చే ఏడాదిలో కార్యకర్తలకు మరింత ప్రాధాన్యత కల్పిస్తూ, వారి పాత్రను మరింత బలోపేతం చేసే విధంగా కార్యాచరణ చేపడతామని ఆయన వెల్లడించారు. కార్యకర్తలే పార్టీకి పునాది అని, వారి కృషి వల్లే తెలుగుదేశం పార్టీ ప్రజల్లో మరింత బలంగా నిలుస్తుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.Bapatla Local News
ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.







