chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍బాపట్ల జిల్లా

Bapatla Local News :స్టువర్టుపురం గిరిజన సంక్షేమ పాఠశాలపై ఎమ్మెల్యే ఆకస్మిక తనిఖీ-మెనూ పాటించకపోవడంపై తీవ్ర ఆగ్రహం

బాపట్ల:డిసెంబర్ 13:-బాపట్ల మండలం స్టువర్టుపురం గ్రామంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ పాఠశాలను బాపట్ల నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ వేగేశన నరేంద్ర వర్మ రాజు గారు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం భోజనం అందిస్తున్నారా లేదా అన్న విషయాన్ని ఎమ్మెల్యే నేరుగా పిల్లలను అడిగి తెలుసుకున్నారు.విద్యార్థులు స్పందిస్తూ మెనూ ప్రకారం భోజనం అందించడం లేదని ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. రోజూ ఇవ్వాల్సిన కోడి గుడ్డు ఇవ్వడం లేదని, ఇప్పటివరకు స్వీట్ అసలు పెట్టలేదని, స్నాక్స్, రాగి లడ్డు కూడా అందించడంలేదని విద్యార్థులు వాపోయారు. అంతేకాకుండా భోజనం కూడా చాలీచాలకుండా పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

Bapatla Local News :స్టువర్టుపురం గిరిజన సంక్షేమ పాఠశాలపై ఎమ్మెల్యే ఆకస్మిక తనిఖీ-మెనూ పాటించకపోవడంపై తీవ్ర ఆగ్రహం

విద్యార్థుల మాటలు విన్న ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ రాజు గారు పాఠశాల ప్రిన్సిపల్ సోమయ్యపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చిన్న పిల్లలకు నాణ్యమైన భోజనం అందించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినప్పటికీ వాటిని పట్టించుకోకపోవడం దురదృష్టకరమని ఎమ్మెల్యే మండిపడ్డారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ, పాఠశాలలో జరుగుతున్న అవకతవకలపై జిల్లా కలెక్టర్ డాక్టర్ వాసుదేవ వినోద్ కుమార్ గారికి ప్రిన్సిపల్ సోమయ్యపై ఫిర్యాదు చేస్తామని తెలిపారు.Bapatla Local News విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించడంలో సంబంధిత ఉద్యోగులు పూర్తిగా విఫలమయ్యారని విచారం వ్యక్తం చేశారు.చిన్నపిల్లలకు ప్రభుత్వం కేటాయించిన స్నాక్స్, స్వీట్లు, రాగి లడ్డు ఇవ్వకపోవడం, మిగిలిన భోజనం కూడా తక్కువగా అందించడం తీవ్ర నిర్లక్ష్యానికి నిదర్శనమని అన్నారు. ఈ విషయాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకునేలా చేస్తానని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.పిల్లల ఆరోగ్యం, భవిష్యత్తుతో ఎలాంటి రాజీ ఉండదని, ఇలాంటి నిర్లక్ష్యాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ రాజు గారు హెచ్చరించారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker