
పల్నాడు:18-10-25:- జిల్లా ఎస్పీ శ్రీ బి.కృష్ణారావు గారి ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ. నారా చంద్రబాబు నాయుడు గారి పిలుపుమేరకు, ప్రతి మూడవ శనివారం పర్యావరణ పరిరక్షణ కోసం నిర్వహించబడుతున్న “స్వర్ణాంధ్ర-స్వచ్ఛ ఆంధ్ర” కార్యక్రమంలో భాగంగా ఈ రోజు జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్ లలో పోలీసు అధికారులు సిబ్బంది కలిసి శ్రమదానం చేసి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచారు.
జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయం లోపల , ఆవరణలలో,పోలీస్ పరేడ్ గ్రౌండ్ నందు పరిసరాలను పరిశుభ్రం చేశారు. పిచ్చి మొక్కలను తొలగించారు. 🔰మన చుట్టూ ఉన్న పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటే అందరూ ఆరోగ్యంగా ఉంటారని జిల్లా ఎస్పీ శ్రీ బి.కృష్ణారావు ఐపీఎస్ గారు పోలీసు అధికారులకు, సిబ్బంది కి సూచించారు.







