Trendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍బాపట్ల జిల్లా

Swift Solutions: A 100% Commitment to Immediate GrievanceRedressal | తక్షణ పరిష్కారం: గ్రీవెన్స్ రిడ్రెస్సల్ కోసం 100% నిబద్ధతతో

Swift Solutions: A 100% Commitment to Immediate GrievanceRedressal | తక్షణ పరిష్కారం: గ్రీవెన్స్ రిడ్రెస్సల్ కోసం 100% నిబద్ధతతో

ప్రజల ఇబ్బందులను గుర్తించి వారి సమస్యలు తక్షణమే పరిష్కరించాలని జిల్లా సంయుక్త కలెక్టర్ భావన విశిష్ట తెలిపారు. ఎస్టీలు, విభిన్న ప్రతిభావంతుల ప్రత్యేక పి జి ఆర్ ఎస్ కార్యక్రమం నాల్గోశుక్రవారం స్థానిక కలెక్టరేట్ లో జరిగింది. అన్ని మండల తహసిల్దారులతో వీక్షణ సమావేశం ద్వారా ఆమె మాట్లాడారు. జిల్లా సంయుక్త కలెక్టర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ప్రజల నుంచి వచ్చిన అర్జీలను స్వీకరించి తక్షణమే పరిష్కార మార్గం చూపారు. మిగిలినవి సంబంధిత శాఖల అధికారులు పరిశీలించి, విచారించాలని ఆదేశించారు.

      ప్రజల అర్జీలను తక్షణమే పరిష్కరించాలని జిల్లా సంయుక్త కలెక్టర్ చెప్పారు. కార్యాలయాల చుట్టూ తిప్పించుకోవడం మంచి పద్ధతి కాదన్నారు. పీజీ ఆర్ఎస్ లో నమోదైన ప్రతి అర్జీని తక్షణమే పరిష్కరించాలన్నారు. డిసెంబర్ ఒకటో తేదీన పింఛన్ నగదు పంపిణీకి ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. బ్యాంకుల నుంచి తక్షణమే నగదు డ్రా చేసుకుని పింఛన్ పంపిణీ సిబ్బందికి ఇవ్వాలన్నారు. సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు. తుపాను హెచ్చరిక నేపథ్యంలో సిబ్బంది జాగ్రత్తలు వహించాలన్నారు. ఒకటో తేదీన నూరు శాతం పింఛన్ నగదు పంపిణీకి ప్రణాళికతో ముందుకు వెళ్లాలన్నారు. గత నెలలో మిగిలిన నగదును వెంటనే చెల్లించాలన్నారు. ఇతర కారణాలతో లబ్ధిదారుడు అందుబాటులో లేకపోతే మిగిలిన నగదును సిబ్బంది తక్షణమే తిరిగి చెల్లించాలన్నారు.

    బాపట్ల జిల్లా నుంచి అద్దంకి నియోజకవర్గంలోని ఐదు మండలాలు విడిపోతున్నాయని డి ఆర్ ఓ జి.గంగాధర్ గౌడ్ తెలిపారు. ఇందుకు సంబంధించి ప్రభుత్వం విడుదల చేసిన గజిట్ నోటిఫికేషన్ ను అన్ని ప్రభుత్వ కార్యాలయాలలో ప్రదర్శనకు ఉంచాలన్నారు. ప్రభుత్వ ప్రకటనలు ప్రజలందరికీ తెలిసేలా అవగాహన కల్పించాలన్నారు. అలాగే ప్రజల నుంచి అభ్యంతరాలు స్వీకరించాలని ఆయన సూచించారు. 

      ఈ కార్యక్రమంలో బాపట్ల ఆర్డిఓ పి.గ్లోరియా, వివిధ శాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.


Swift Solutions: A 100% Commitment to Immediate GrievanceRedressal | తక్షణ పరిష్కారం: గ్రీవెన్స్ రిడ్రెస్సల్ కోసం 100% నిబద్ధతతో

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker