chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా

Vijayawada Local News :సైబర్ నేరాల కట్టడికి సాంకేతిక నైపుణ్యం ప్రజా అవగాహనే కీలకం- స్పీకర్ అయ్యన్నపాత్రుడు

విజయవాడ: డిసెంబర్ 22:-సైబర్ నేరాలను సమర్థవంతంగా ఎదుర్కోవాలంటే సాంకేతిక నైపుణ్యంతో పాటు ప్రజల్లో అవగాహన పెంపొందించాల్సిన అవసరం ఉందని ఆంధ్రప్రదేశ్ శాసనసభ గౌరవ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు గారు అన్నారు.

Vijayawada Local News :సైబర్ నేరాల కట్టడికి సాంకేతిక నైపుణ్యం ప్రజా అవగాహనే కీలకం- స్పీకర్ అయ్యన్నపాత్రుడు

సోమవారం విజయవాడలోని సిద్ధార్థ అకాడమీ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్‌లో కే.వి. రావు గారి సహకారంతో ఏర్పాటు చేసిన “కే.వి. రావు సెంటర్ ఫర్ సైబర్ సెక్యూరిటీ అండ్ డిజిటల్ ఫోరెన్సిక్” కేంద్రాన్ని స్పీకర్ గారు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.

ఈ సందర్భంగా నిర్వహించిన సభలో స్పీకర్ మాట్లాడుతూ, దేశం వేగంగా డిజిటల్ యుగంలోకి ప్రవేశిస్తున్న తరుణంలో బ్యాంకింగ్, ఆరోగ్యం, పాలన వంటి కీలక రంగాలు టెక్నాలజీపై ఆధారపడుతున్నాయని తెలిపారు. నేరం జరిగిన తర్వాత నిజాన్ని వెలికితీయడంలో డిజిటల్ ఫోరెన్సిక్ కీలకమని, నేరాలు జరగకుండా ముందే అడ్డుకోవడంలో సైబర్ సెక్యూరిటీ ప్రధాన పాత్ర పోషిస్తుందన్నారు.

విద్యార్థులు కేవలం డిగ్రీలకే పరిమితం కాకుండా ప్రాక్టికల్ నాలెడ్జ్‌ను పెంపొందించుకుని దేశ భద్రతకు తోడ్పడాలని ఆయన పిలుపునిచ్చారు. పోలీస్, న్యాయ వ్యవస్థతో పాటు ఐటీ రంగాల్లో సైబర్ నిపుణులకు విస్తృత ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు.

సైబర్ మోసాలు రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని స్పీకర్ సూచించారు. తెలియని లింక్‌లను క్లిక్ చేయకూడదని, ఓటీపీలు ఇతరులతో పంచుకోకూడదని, లాటరీల పేరుతో వచ్చే సందేశాలను నమ్మవద్దని హెచ్చరించారు. సోషల్ మీడియాలో వచ్చే సమాచారాన్ని నిర్ధారించుకున్న తర్వాతే విశ్వసించాలని తెలిపారు.

ఈ సెంటర్ ద్వారా స్వర్ణాంధ్ర @2047, వికసిత్ భారత్ 2047 లక్ష్యాల సాధనలో యువత కీలక పాత్ర పోషించాలని ఆకాంక్షించారుVijayawada news.

ఈ కార్యక్రమంలో గౌరవ డిప్యూటీ స్పీకర్ శ్రీ రఘురామకృష్ణ రాజు గారు (డిస్టింగ్విష్డ్ గెస్ట్), సిద్ధార్థ అకాడమీ మేనేజ్మెంట్ సభ్యులు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker