ఆంధ్రప్రదేశ్
AP POLITICAL – HOT NEWS: హద్దు మీరి మాట్లాడ వద్దు – టీడీపీ హైకమాండ్ సీరియస్
TDP CONTROL PARTY LEADERS
మంత్రి నారా లోకేష్ ను డిప్యూటీ సీఎం చేయాలన్న డిమాండ్లు వినిపిస్తోన్న నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ అధిష్ఠానం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ అంశంపై ఎవరూ మాట్లాడవద్దని పార్టీ నేతలను ఆదేశించింది. ఎవరూ మీడియా వద్ద బహిరంగ ప్రకటనలు చేయవద్దని సూచించింది. ఏ నిర్ణయమైనా కూటమి నేతలు కూర్చొని మాట్లాడుకుంటారని స్పష్టం చేసింది. వ్యక్తిగత అభిప్రాయాలను పార్టీపై రుద్దవద్దని పేర్కొంది. ఇటీవల సీఎం చంద్రబాబు మైదుకూరు పర్యటనలో ఉన్నప్పుడు కడప జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. నారా లోకేష్ కు ఉపముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని తన అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. ఆ తర్వాత పలువురు నేతలు ఇదే అంశంపై బహిరంగంగా మాట్లాడారు. పార్టీతో సంబంధం లేకపోయినప్పటికీ.. ఎవరి వ్యక్తిగత అభిప్రాయాలను వారు చెబుతున్నారు.