chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
తెలంగాణ

“తెలంగాణలో మల్లన్న – కవిత ఘర్షణ.. జాగృతి దాడి, కాల్పుల కలకలం | Telangana Politics”

“తెలంగాణలో మల్లన్న – కవిత ఘర్షణ.. జాగృతి దాడి, కాల్పుల కలకలం | Telangana Politics”

తెలంగాణలో తీన్మార్ మల్లన్న – కవిత ఎపిసోడ్ వేడెక్కింది.
బీసీ రిజర్వేషన్ల అంశంపై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఉద్దేశించి అసభ్యకర వ్యాఖ్యలు చేసినట్టు ఆరోపణలతో, మల్లన్నపై తెలంగాణ జాగృతి కార్యకర్తలు మండిపడ్డారు. హైదరాబాద్‌లోని క్యూన్యూస్ కార్యాలయంపై దాడి చేసి ఫర్నిచర్ ధ్వంసం చేశారు. ఈ దాడి జరుగుతున్న సమయంలో తీన్మార్ మల్లన్న గన్‌మెన్లు గాల్లోకి కాల్పులు జరపడంతో ఉద్రిక్తత చెలరేగింది. ఈ కాల్పుల వ్యవహారంపై పోలీసు శాఖ ఫోకస్ పెడుతూ, మల్లన్న గన్‌మెన్లను అదుపులోకి తీసుకుని స్టేట్మెంట్ రికార్డు చేసింది. మల్లన్న చెప్పడంతోనే కాల్పులు జరిపామని గన్‌మెన్లు వెల్లడించినట్టు సమాచారం.

ఇక ఈ ఎపిసోడ్‌లో తీన్మార్ మల్లన్న తగ్గక, కవిత కూడా తగ్గలేదు. తాను అన్నది తెలంగాణ సామెత మాత్రమేనని, కానీ బీసీల కోసం పాట్లు పడుతున్న తనపై దాడి చేయించిందని మల్లన్న ఆరోపించారు. బీసీలను అణచివేయాలని కవిత ప్రయత్నిస్తున్నారని, బీసీలు తిరగనివ్వరని హెచ్చరించారు. మరోవైపు కవిత, మల్లన్న వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ, మహిళలపై ఇలా మాట్లాడటం తగదని, మల్లన్నను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే NHRCని ఆశ్రయిస్తానని హెచ్చరించారు.

ఇక కాంగ్రెస్ నేతలు కూడా స్పందిస్తూ, “మాటల నుంచి దాడుల వరకు వెళ్లడం తెలంగాణ సంస్కృతి కాదు, ఇద్దరూ సంయమనంతో వ్యవహరించాలి” అని సూచించారు. కవిత నివాసం, జాగృతి కార్యాలయం వద్ద పోలీసు బందోబస్తు పెంచారు. ఈ ఘర్షణ తర్వాత ప్రభుత్వమే ఎలా స్పందిస్తుంది, మల్లన్నపై కేసు పెడతారా లేదా అన్నది రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఆసక్తిగా మారింది.

Authors

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Check Also
Close
Back to top button

Adblock Detected

Please Disable the Adblocker