
హైదరాబాద్, మార్చి 7:-తెలంగాణ టాక్స్ ప్రాక్టీషనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్ నాంపల్లి ఫ్యాబ్స్సి భవన్లో జీఎస్టీ, ఆదాయ పన్ను అంశాలపై ప్రత్యేక సదస్సు నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 500 మంది ప్రతినిధులు ఈ సదస్సులో పాల్గొన్నారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ కమర్షియల్ టాక్స్ కమిషనర్ రఘునందన్ రావు మాట్లాడుతూ పన్ను చట్టాలపై నిరంతర అవగాహన పెంపొందించుకోవడం ప్రతి టాక్స్ ప్రాక్టీషనర్కు అత్యంత అవసరమని పేర్కొన్నారు. రాష్ట్ర ఆదాయంలో జీఎస్టీ కీలక పాత్ర పోషిస్తోందని ఆయన తెలిపారు.
టాక్స్ పేయర్స్ మరియు ప్రభుత్వానికి మధ్య టాక్స్ ప్రాక్టీషనర్స్ ఒక వంతెనలాంటివారని, టాక్స్ పేయర్స్కు సరైన మార్గదర్శకత్వం అందిస్తూ ప్రభుత్వానికి రెవెన్యూ పెరగడానికి సహకరించాల్సిన బాధ్యత ఉందని ఆయన సూచించారు. జీఎస్టీపై ఇలాంటి అవగాహన కార్యక్రమాలు ఎంతో ఉపయోగకరమని పేర్కొన్నారు.Hyderabad- Amaravathi
సదస్సులో జీఎస్టీ, ఆదాయపు పన్ను చట్టాలలో వచ్చిన తాజా మార్పులు, అలాగే ప్రాక్టికల్ సమస్యల పరిష్కారాలపై నిపుణులు వివరణాత్మకంగా చర్చించారు. పాల్గొన్న ప్రతినిధులు నిపుణులతో చర్చించి తమకు అవసరమైన మార్గదర్శకత్వాన్ని పొందారు.







