Trendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 నల్గొండ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍గుంటూరు జిల్లా

తెనాలిలో 10 MLD మురుగు నీటి శుద్ధి కేంద్రాన్ని ప్రారంభించిన కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్

తెనాలి, అక్టోబర్ 11:అమృత్ 1.0 పథకం కింద తెనాలి పట్టణంలోని 11వ వార్డులో నిర్మితమైన 10 మిలియన్ లీటర్ల మురుగు నీటి శుద్ధి కేంద్రాన్ని శనివారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర గ్రామీణాభివృద్ధి మరియు సమాచార శాఖ సహాయ మంత్రి డా. పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర సివిల్ సప్లైస్ శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ పాల్గొన్నారు.

తెనాలిలో 10 MLD మురుగు నీటి శుద్ధి కేంద్రాన్ని ప్రారంభించిన కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్

పెమ్మసాని చంద్రశేఖర్ గారి వ్యాఖ్యలు:

  • “మట్టిని ప్రేమించే తెనాలి రైతులకు, శక్తి–యుక్తులు కలిగిన మహిళలకూ, పౌరులకూ నా నమస్కారాలు,” అంటూ ప్రారంభించిన మంత్రి పెమ్మసాని, అభివృద్ధి మరియు ఆరోగ్యంపై దృష్టి సారించారు.
  • “ఓట్ల కోసం మాత్రమే పనిచేసే నాయకులు, అభివృద్ధి కోసం పాటుపడే నాయకుల మధ్య తేడా ఇక్కడ స్పష్టంగా కనిపిస్తోంది,” అన్నారు.
  • క్యాన్సర్ బాధితుల పెరుగుదలపై ఆందోళన వ్యక్తం చేస్తూ, “ఆరోగ్యంపై అవగాహన కల్పించని నాయకుల కారణంగా ఈ పరిస్థితులు వచ్చాయి” అని వ్యాఖ్యానించారు.
  • గత వైసిపి హయాంలో కేంద్ర నిధులను వాడుకునే అవగాహన లేక అభివృద్ధి కార్యక్రమాలు నిలిచిపోయినట్లు మండిపడ్డారు.
  • తెనాలిలో జరుగుతున్న రైల్వే స్టేషన్ అభివృద్ధి, రోడ్ల విస్తరణ, బిఎస్ఎన్ఎల్ స్థల సమస్య పరిష్కారంపై ప్రత్యేకంగా స్పందించారు.
  • జీఎస్టీ తగ్గింపు వల్ల ప్రజలకు ఆర్థిక భారం తగ్గిందని, డిజిటల్ పేమెంట్లపై అవగాహన పెంచుకోవాలన్నారు.
  • “ప్రారంభోత్సవం కాదు, నిర్వహణ కూడా బాధ్యతగా తీసుకోవాలి,” అంటూ ప్రజల పాత్రను గుర్తుచేశారు.

ఆలపాటి రాజేంద్రప్రసాద్ గారి వ్యాఖ్యలు:

  • “2017లో చంద్రబాబు హయాంలో 10 MLD, 3 MLD STPల పునాది వేసాం. ఇప్పుడు 10 MLD అందుబాటులోకి వచ్చింది,” అని చెప్పారు.
  • “ప్రతిరోజూ రూ. 2.80 కోట్ల లీటర్ల మురుగు నీరు వెలువడుతోంది. శుద్ధికి తగిన సాంకేతిక పరిజ్ఞానం అవసరం,” అన్నారు.
  • శానిటేషన్ మరియు గార్బేజ్ సమస్యల నివారణకు ఇదొక మైలురాయి అన్నారు.

నాదెండ్ల మనోహర్ గారి వ్యాఖ్యలు:

  • “కూటమి ప్రభుత్వం ప్రజలకు ఉపయోగపడే విధంగా పారిశుధ్య సౌకర్యాలు ఏర్పాటు చేస్తోంది,” అన్నారు.
  • “గత ప్రభుత్వం చంద్రబాబు నిర్ణయాలను అడ్డుకోవడమే లక్ష్యంగా టిడ్కో ఇళ్లను మూలన పడేసింది,” అంటూ విమర్శించారు.
  • 11వ వార్డులో ఏర్పాటు చేసినా, పట్టణంలోని అన్ని వార్డుల నుంచి వచ్చే మురుగు నీరు శుద్ధి చేస్తామని తెలిపారు.
  • “ప్రతినెలా 1వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకల్లా పెన్షన్ అందేలా చర్యలు తీసుకుంటాం,” అన్నారు.

ఇతర ముఖ్య అతిథులు:

ఈ కార్యక్రమంలో డీసీఎంఎస్ ఛైర్మన్ వడ్రా నం హరిబాబు, మునిసిపల్ కమిషనర్ అప్పలనాయుడు, స్థానిక కౌన్సిలర్ రత్నకుమారి, పబ్లిక్ హెల్త్ అధికారులు తదితరులు పాల్గొన్నారు

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button