ఆంధ్రప్రదేశ్

తల్లికి వందనం 2nd Installment Update | Thalliki Vandanam Money Status Check Full Guide

తల్లికి వందనం 2nd Installment Update | Thalliki Vandanam Money Status Check Full Guide

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాలలో భాగంగా తల్లికి వందనం పథకం ద్వారా లభించే రెండవ విడత డబ్బులపై పెద్ద అప్‌డేట్ వచ్చింది. జూన్ 12న తొలి విడతలో తల్లుల ఖాతాల్లో డబ్బులు జమ చేసిన ప్రభుత్వం, ఈ నెల 10న రెండవ విడత డబ్బులు కూడా అకౌంట్లలో జమ చేయనుంది.

తల్లికి వందనం పథకం ఏమిటి?
పిల్లలు ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటో తరగతి లేదా ఇంటర్ ఫస్ట్ ఇయర్‌లో చేరిన తల్లుల ఖాతాల్లో రూ.13,000 చొప్పున నేరుగా జమ చేయడం ద్వారా తల్లులు, కుటుంబాలను ఆర్థికంగా ప్రోత్సహించడానికి ప్రభుత్వం ప్రారంభించిన పథకం ఇది.

జూన్‌లో చేసిన జమల్లో పలు కారణాల వల్ల కొందరికి డబ్బులు రాకపోవడం, ఇంకా ఇంటర్ ఫస్ట్ ఇయర్, ఒకటో తరగతిలో చేరినవారి ఖాతాల్లో డబ్బులు పడకపోవడం జరిగింది. వీరందరికీ ఇప్పుడు మరో అవకాశం ఇచ్చి దరఖాస్తులు పరిశీలించిన ప్రభుత్వం అర్హుల జాబితాను సిద్ధం చేసింది.

ఇప్పుడు ఈ నెల జూలై 10న తల్లికి వందనం పథకం రెండో విడత డబ్బులు అకౌంట్లలో జమ చేయనున్నారు.


తల్లికి వందనం Status Check ఎలా చెక్ చేయాలి?

తల్లికి వందనం డబ్బులు పడలేదా? ఏం చెయ్యాలి? మీ స్టేటస్ చెక్ చేసుకోవాలంటే:

1️⃣ గవర్నమెంట్ వెబ్‌సైట్ https://gsws-nbm.ap.gov.in/ కి వెళ్ళాలి.
2️⃣ ‘Application Status Check’ పై క్లిక్ చేయాలి.
3️⃣ పథకం కోసం ‘తల్లికి వందనం’ సెలెక్ట్ చేసుకోవాలి.
4️⃣ పక్కనే ఉన్న ‘2025-26’ విద్యా సంవత్సరాన్ని సెలెక్ట్ చేయాలి.
5️⃣ మీ ఆధార్ నంబర్, క్యాప్చా ఎంటర్ చేయాలి.
6️⃣ ‘Get OTP’ పై క్లిక్ చేస్తే, మీ ఆధార్ కు లింక్ అయిన మొబైల్ నంబర్‌కు OTP వస్తుంది.
7️⃣ ఆ OTP ఎంటర్ చేసి Submit చేస్తే, మీకు తల్లికి వందనం పథకంలో మీ పేరు ఉంది లేదా, డబ్బులు జమయ్యాయా లేదా, డబ్బులు పడకపోతే ఏ కారణం అని స్టేటస్ చూపిస్తుంది.


ఈ నెల 10న ప్రత్యేకతలు:

🔹 తల్లికి వందనం రెండో విడత డబ్బులు అకౌంట్లలో జమ అవుతాయి.
🔹 అదే రోజున రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలలు, జూనియర్ కాలేజీల్లో Mega Parents-Teachers Meeting (PTM) జరుగుతుంది.
🔹 తల్లులకు డబ్బులు జమ అవుతున్న రోజు, స్కూళ్లలో సమావేశం కూడా జరిగిపోవడం ద్వారా పిల్లల చదువు, హాజరు, అభ్యాసం, తల్లిదండ్రుల అవగాహన పెంచడం లక్ష్యంగా ప్రభుత్వం ముందుకెళ్తోంది.


ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు ముఖ్య సూచనలు:

ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న SC, ST విద్యార్థుల తల్లులు అకౌంట్లలో డబ్బులు పొందడానికి, తల్లి అకౌంట్ ఆధార్‌తో NPCI లింక్ అయి ఉండాలి.
👉 ఆధార్ తో లింక్ కానట్లయితే వెంటనే బ్యాంక్‌కి వెళ్లి లింక్ చేయించాలి.
👉 ఖాతా లేకపోతే పోస్టాఫీస్‌లో ఖాతా తీసుకొని ఆధార్ తో లింక్ చేయించాలి.
లేదంటే డబ్బులు పడకుండా తిరిగి రాబోతాయి, అందుకే వెంటనే లింక్ చేయించుకోవాలి.


తల్లులు ఈ విషయాలు తప్పక గుర్తుంచుకోవాలి:

✅ 10న అకౌంట్‌లో డబ్బులు వచ్చాయో లేదో చెక్ చేయాలి.
✅ పేరు లేని పక్షంలో పాఠశాల టీచర్ల ద్వారా సమాచారం తెలుసుకోవాలి.
✅ NPCI ఆధార్ లింక్ అయి ఉందో లేదో బ్యాంక్‌కి వెళ్లి కన్ఫర్మ్ చేసుకోవాలి.

Authors

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker