
విశాఖపట్నం: విశాఖపట్నం జిల్లాలో పదో తరగతి పరీక్షలు సజావుగా సాగుతున్నాయి. మార్చి 16 నుంచి ఏప్రిల్ 1 వరకు జరిగే ఈ పరీక్షల కోసం విద్యాశాఖ జిల్లాలో 133 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసింది. మొత్తం 28,983 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నట్లు జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ తెలిపారు.
పరీక్షలు ఉదయం 9.30 గంటల నుండి మధ్యాహ్నం 12.45 గంటల వరకు జరుగుతాయి. విద్యార్థులు సమయపాలన పాటించాలని, ఉదయం 10 గంటల తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ పరీక్షా కేంద్రంలోకి అనుమతించబోమని అధికారులు స్పష్టం చేశారు. పరీక్షల సజావు నిర్వహణ కోసం 1,634 మంది ఇన్విజిలేటర్లను నియమించారు. జిల్లాలోని సమస్యాత్మకమైన 8 పరీక్షా కేంద్రాల్లో సిసి కెమెరాలను ఏర్పాటు చేసి గట్టి నిఘా ఉంచారు.

పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల సౌకర్యార్థం, హాల్ టికెట్ చూపిస్తే ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించారు. ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్థుల కోసం 260 మంది స్క్రైబ్స్ ను కూడా ఏర్పాటు చేశారు. జిల్లా వ్యాప్తంగా పరీక్షలు జరుగుతున్న తీరును కలెక్టర్ కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ విద్యాశాఖ అధికారుల ద్వారా ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. విద్యార్థులు ఎటువంటి ఆందోళన లేకుండా ప్రశాంతమైన వాతావరణంలో పరీక్షలు రాయాలని ఆయన పిలుపునిచ్చారు.http://VISAKHA







