IDPS:ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ చెరుకుపల్లిలోఐఐటీ, నీట్ విద్యా బోధనపై అవగాహన సదస్సు
ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ చెరుకుపల్లిలో ఆదివారం ఐఐటీ, నీట్ విద్యా బోధనపై అవగాహన సదస్సు జరిగింది. ఈ కార్యక్రమానికి కోటా రాజస్థాన్ వ్యాస్ ఇన్స్టిట్యూట్ ఫౌండర్, సీఈఓ శిశిర్ మిట్టల్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. విద్యార్ధులు, తల్లిదండ్రులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ…
దేశ వ్యాప్తంగా ఐఐటీ, నీట్ విద్యార్ధులను తీర్చి దిద్దడంలో కోటా ప్రత్యేక గుర్తింపు పొందిందని చెప్పారు. ఈ అకాడమీలో ప్రత్యేక శిక్షణతో పాటు విద్యార్ధులకు సులభతరంగా సిలబస్ ను రూపొందించడం జరిగిందని తెలిపారు. ఉత్తమమైన విద్యార్ధులుగా తీర్చి, మంచి ఫలితాలను సాధించడమే తమ లక్ష్యమని ఆయన వెల్లడించారు. ఐఐటీ, ఆలిండియా స్థాయిలో 1, 2, 17, ర్యాంకులు సాధించిన విద్యార్ధులు వ్యాస్ లో శిక్షణ తీసుకున్న వారేనని తెలిపారు. ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ చెరుకుపల్లి ఎంతో విశాలమైన ప్రాంగణంలో ఏర్పాటు చేయడం ఆనందంగా వుందన్నారు. ఇక్కడ చదివే విద్యార్ధుల పట్ల ఉపాధ్యాయులు ఎంతో శ్రద్ద వహిస్తున్నారని పేర్కొన్నారు. ఐడీపీఎస్ తో కోటా రాజస్థాన్ వ్యాస్ ఒప్పందం చేసుకోవడం, ఇక్కడి విద్యార్ధుల మేధస్సుని పెంచడమే తమ లక్ష్యమని చెప్పారు. విద్యార్ధులు, తల్లిదండ్రులు ఐడీపీఎస్ పై ఉంచిన నమ్మకానికి రాబోయే రోజుల్లో మెరుగైన ఫలితాలు సాధించి తీరుతామని ఆశాభావం వ్యక్తం చేశారు.
కోటా చీఫ్ టెక్కికల్ ఆఫీసర్ ఉత్కర్ష్ గుప్తా మాట్లాడుతూ కొంతమంది విద్యార్ధులను చూస్తుంటే ఐఐటీ, నీట్ లో టెక్నికల్ గా ఎక్కడా శిక్షణ ఇవ్వడం లేదని చెప్పారు. విద్యార్థి తరగతులు పెరుగుతున్న కొద్దీ ఏ విభాగంలో వెనుకబడుతున్నారు అనేది ప్రతి ఏడాది మెరుగు పరుచుకుంటూ, ప్రతి విద్యార్ధి రికార్డును పొందుపరిచి టెక్కికల్ అప్ డేట్ చేసి వారు మెరుగైన ఫలితాలు సాధించడానికి దోహదపడతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ఛైర్మన్ పి. ఏడుకొండలరెడ్డి, డైరెక్టర్ సాయిరంగారెడ్డి, అకడమిక్ డైరెక్టర్ వందనశర్మ, ప్రన్సిపాల్ మణివర్మ, అడ్మినిస్ట్రైటీవ్ ఆఫీసర్ కె. శివప్రసాద్, విద్యార్ధులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.
all videos hear wathc on…