గుంటూరుఆంధ్రప్రదేశ్
The strike of municipal engineering employees is continuing, demanding solutions to their problems.
సమస్యల పరిష్కారం కోరుతూ మున్సిపల్ ఇంజనీరింగ్ ఉద్యోగుల సమ్మె కొనసాగుతోంది. ఇందులో భాగంగా గురువారం నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. మున్సిపల్ కార్మికులకు వేతనాలు పెంచడం తోపాటు ప్రభుత్వ సంక్షేమ పథకాలను కూడా అందించాలని యూనియన్ నాయకులు మధుబాబు డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించని పక్షంలో నిరంతరం ఆందోళనలు కొనసాగిస్తామని ఆయన స్పష్టం చేశారు.