=తిరుమల శ్రీవారిని నైవేద్య విరామ సమయంలో తెలంగాణ హైకోర్టు జడ్జి మధుసూదన్ రావు, ఒరిస్సా సిజే హరీష్ తాండన్, సినీ నటుడు సుమన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు మరియు షష్టిపూర్తి సినిమా బృందం (రాజేంద్రప్రసాద్, హీరో రూపేష్, డైరెక్టర్ పవన్) వేరువేరుగా స్వామి వారిని దర్శించుకున్నారు వీరికి ఆలయ అధికారులు దగ్గరుండి దర్శన ఏర్పాట్లు చేశారు దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వీరిని సత్కరించి వేద పండితులు వేద ఆశీర్వచనం పలికి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.
అనంతరం ఆలయం వెలుపల సినీ నటుడు రాజేంద్రప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ షష్టిపూర్తి సినిమా విడుదలై ప్రేక్షకుల మన్ననలు పొందుతున్న సందర్భంగా కృతజ్ఞతలు తెలపడానికి వచ్చామని
అలాగే నేను రవితేజ నటించిన సినిమా జులై నెలలో విడుదల కావచ్చు ఆ సినిమా కూడా ఆ స్వామి వారి ఆశీర్వాదంతో ప్రేక్షకుల మన్ననలు పొందాలని శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని వేడుకున్నట్టు తెలిపారు.