chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 మహబూబ్‌నగర్ జిల్లా📍 మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
వాతావరణంఆంధ్రప్రదేశ్📍బాపట్ల జిల్లా

Bapatla news తుఫాను ప్రభావితప్రాంతాల్లోబాపట్ల జిల్లాకలెక్టర్ వి. వినోద్ కుమార్ పర్యటన

బాపట్ల: 29.10.2025:-బాపట్ల జిల్లా కలెక్టర్ డాక్టర్ వి. వినోద్ కుమార్ తుఫాను ప్రభావిత ప్రాంతాలను సందర్శించారు. నీట మునిగిన ప్రాంతాల్లో నీటి తరలింపు చర్యలను సమీక్షిస్తూ అధికారులకు పలు సూచనలు చేశారు.బుధవారం పర్చూరు వాగు వద్ద వరద ఉధృతి పరిస్థితిని కలెక్టర్ ప్రత్యక్షంగా పరిశీలించారు.

Bapatla news తుఫాను ప్రభావితప్రాంతాల్లోబాపట్ల జిల్లాకలెక్టర్ వి. వినోద్ కుమార్ పర్యటన

తుఫాన్ ప్రభావంతో పర్చూరు, నాగులపాలెం గ్రామాలు వరదముంపుకు గురికావడంతో చీరాల–చిలకలూరిపేట హైవే పర్చూరు వద్ద సుమారు 10 మీటర్ల వెడల్పులో రెండు చోట్ల కాలువలు త్రవ్వించి నీటిని దిగువకు తరలించేలా తక్షణ చర్యలు చేపట్టారు.అలాగే, పర్చూరు–ఉప్పుటూరు రహదారి మీదుగా వాగు నీరు ప్రవహిస్తున్నందున ప్రజల రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేయాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు.

Bapatla news తుఫాను ప్రభావితప్రాంతాల్లోబాపట్ల జిల్లాకలెక్టర్ వి. వినోద్ కుమార్ పర్యటన

తదుపరి, కారంచేడు తహసిల్దార్ కార్యాలయాన్ని సందర్శించిన కలెక్టర్, పర్చూరు వాగు ప్రవాహ పరిస్థితిని మ్యాప్ ద్వారా పరిశీలించారు. వాగు ఉధృతంగా ఉన్న కారణంగా పరివాహక గ్రామాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని సూచించారు. అంతేకాకుండా వాగు నీటిని పొలాల వైపు మళ్లించేలా తగిన ఇంజినీరింగ్ చర్యలు తీసుకోవాలని కారంచేడు తహసిల్దార్, చీరాల డ్రైనేజీ సబ్‌డివిజన్-2 డివిజనల్ ఇంజినీర్‌కు ఆదేశాలు జారీ చేశారు.ఈ సందర్శనలో పర్చూరు మండల ప్రత్యేక అధికారి లవన్న, నేషనల్ హైవే డి.ఇ. శ్రీనివాసరావు, చీరాల డ్రైనేజీ సబ్‌డివిజన్ నెం.2 డి.ఇ. మల్లికార్జునరావు, పర్చూరు తహసిల్దార్ బ్రహ్మయ్య, కారంచేడు తహసిల్దార్ నాగరాజు, డ్రైనేజీ శాఖ ఏ.ఇలు మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker