
గుంటూరు, ఫిబ్రవరి 4:-యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే ప్రక్రియను జిల్లా కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా బుధవారం పరిశీలించారు. గుంటూరు పట్టణంలోని కేవీపీ కాలనీ రెండో లైన్లో జరుగుతున్న సర్వేను ఆయన ప్రత్యక్షంగా పరిశీలించి, సిబ్బంది పనితీరును అడిగి తెలుసుకున్నారు.

స్వర్ణ వార్డు సచివాలయ సిబ్బంది ప్రతి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యుల పూర్తి వివరాలను నేరుగా యాప్లో నమోదు చేస్తున్న తీరుపై కలెక్టర్ సంతృప్తి వ్యక్తం చేశారు. సర్వేను అత్యంత పకడ్బందీగా నిర్వహించాలని, ఎలాంటి తప్పులకు ఆస్కారం లేకుండా డేటా నమోదు చేయాలని ఆయన సిబ్బందికి ఆదేశించారు.

ఈ సర్వే ద్వారా కుటుంబాల అవసరాలను గుర్తించి, వాటికి అనుగుణంగా సంక్షేమ పథకాలు అమలు చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని కలెక్టర్ తెలిపారు. GUNTUR NEWSఅన్ని కుటుంబాలను స్వర్ణ గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది తప్పనిసరిగా సందర్శించి పూర్తి వివరాలను యాప్లో నమోదు చేయాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో గుంటూరు నగర పాలక సంస్థ ఉప కమిషనర్ బి. శ్రీనివాసరావు, స్వర్ణ సచివాలయాల సమన్వయకర్త మోహన్రెడ్డి, వెల్ఫేర్ సెక్రటరీ శ్రీనివాసరావు తదితర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.










