Trendingఅనకాపల్లిఅనంతపురంఅన్నమయ్యఅమరావతిఅల్లూరి సీతారామరాజుఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్ఎన్టీఆర్ విజయవాడఏలూరుకర్నూలుకాకినాడకృష్ణాకోనసీమగుంటూరుచిత్తూరుజాతీయ వార్తలుటెక్నాలజితిరుపతితూర్పుగోదావరితెలంగాణదినఫలాలునందజ్యోతినంద్యాలనెల్లూరుపల్నాడుపశ్చిమగోదావరిప్రకాశంబాపట్లమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవిజయనగరంవిశాఖపట్నంవెదర్ రిపోర్ట్వైయస్సార్ కడపశ్రీకాకుళంశ్రీసత్యసాయిస్పోర్ట్స్హైదరాబాద్
బాపట్ల

*యూరియా సరఫరాపై వ్యవసాయ అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, పేర్కొన్నారు.

బాపట్ల, సెప్టెంబర్ 13 :శనివారం జిల్లా కేంద్రంలో ఉన్న వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో
ఉన్న మార్క్ఫెడ్ స్టాక్ స్టోర్ చేసే అవేజ్ గౌడౌన్ ను జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ తనిఖీ చేశారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాకు ఇంతవరకు ఎంత యూరియా వచ్చింది, రైతు సేవా కేంద్రాలకు, పిఏసీఎస్, డిసిఎమ్ఎస్ లకు ఎంత యూరియా పంపించారు, గతేడాదికన్నా ఎక్కువ వచ్చిందా, తక్కువ వచ్చిందా, ఎంత నిల్వ ఉంది, యూరియా పంపిణీలో ఏమైనా సమస్యలు ఉన్నాయా తదితర వివరాలను వ్యవసాయ అధికారుల ను జిల్లా కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు.
అవేజ్ గౌడౌన్ నుంచి రైతు సేవా కేంద్రాలకు, పిఏసీఎస్, డిసిఎమ్ఎస్ లకు యూరియా పంపించడంపై దృష్టి సారించాలన్నారు. సీఎంఏఐడి యాప్ ద్వారా రైతులకు యూరియాను అందజేయాలని,రైతులు యూరియా కొనుగోలులో ఏవైనా సమస్యలు ఉన్నట్లయితే లేదా అధిక ధరల అమ్మకాలుకు సంబంధించి రైతులు వ్యవసాయ అధికారులకు ఫిర్యాదు చేయాలని రైతులకు చూచించారు.ఎరువుల కోసం వచ్చే రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలకుండా చూడాలని వ్యవసాయ అధికారులను ఆదేశించారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button