Trendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍గుంటూరు జిల్లా

Guntur local news:ఉండవల్లిలో మంత్రి లోకేష్ సమీక్ష – ఐటీ, ఎలక్ట్రానిక్స్ రంగాలకు ఊరట, రేపటి కేబినెట్‌లో క్వాంటమ్ కంప్యూటింగ్ పాలసీ

ఉండవల్లిః 09-10-25;ఐటీ, ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలకు త్వరలోనే పెండింగ్ రాయితీలు చెల్లించేందుకు అవసరసమైన చర్యలు చేపట్టాలని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. ఉండవల్లి నివాసంలో ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ శాఖపై మంత్రి లోకేష్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ.. స్టార్టప్ ల వృద్ధిలో దేశంలోనే రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలిపేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వాట్సాప్ గవర్నెన్స్ ను మరింత సమర్థంగా తీర్చిదిద్దాలి. మరో రెండు నెలల్లో వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా వెయ్యి సేవలను అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఈ సందర్భంగా మంత్రి ఆదేశించారు. క్వాంటమ్ కంప్యూటింగ్ పాలసీపైనా సమావేశంలో చర్చించారు. రేపటి కేబినెట్ సమావేశంలో క్వాంటమ్ కంప్యూటింగ్ పాలసీని ప్రవేశపెట్టనున్నారు. ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ సర్వీసెస్, ఇన్నోవేషన్ సొసైటీ, స్పేస్ అప్లికేషన్స్ సెంటర్ పైనా సమావేశంలో చర్చించారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button