Trendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 పల్నాడు జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍బాపట్ల జిల్లా

BapatlaNews:vari sekaranaku వరి సేకరణకు మిల్లులు, రైతు సేవా కేంద్రాలు సిద్ధం చేయాలంటూ కలెక్టర్ వినోద్ కుమార్ సూచన

బాపట్ల, అక్టోబర్ 16:డిసెంబరు నుండి జిల్లాలో వరి ధాన్యం కోతలు ప్రారంభం కానుండటంతో, వరి ధాన్యం సేకరణకు అవసరమైన ఏర్పాట్లను తక్షణమే పూర్తి చేయాలని బాపట్ల జిల్లా కలెక్టర్ వి. వినోద్ కుమార్ అధికారులను ఆదేశించారు. గురువారం ఆయన వేమూరు నియోజకవర్గంలోని అమృతలూరు మండలం కూచిపూడి గ్రామంలో ఉన్న రైస్ మిల్లును, రైతు సేవా కేంద్రాన్ని తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ధాన్యాన్ని సేకరించేందుకు అన్ని సదుపాయాలు సిద్ధంగా ఉండాలని సూచించారు. రైతులు పండించే ధాన్యాన్ని సురక్షితంగా నిల్వ చేసేందుకు రైస్ మిల్లులు, రైతు సేవా కేంద్రాల్లో తగిన ఏర్పాట్లు చేయాలని చెప్పారు.ధాన్య సేకరణకు అవసరమైన ఖాళీ గోతాలు, తేమ శాతం కొలిచే పరికరాలు తదితరాలను ముందుగానే సిద్ధం చేయాలని సంబంధిత శాఖాధికారులను ఆదేశించారు. ధాన్యం కొనుగోలు, నిల్వ ప్రక్రియల్లో పారదర్శకత పాటించాల్సిన అవసరాన్ని ఆయన గుర్తు చేశారు.ఈ తనిఖీల్లో రేపల్లె రెవెన్యూ డివిజనల్ అధికారి రామలక్ష్మి, వ్యవసాయ శాఖ అధికారి సుబ్రహ్మణ్యేశ్వరరావు, అమృతలూరు తహశీల్దార్ నెహ్రూ బాబు, ఇతర వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొన్నారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button