chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 మహబూబ్‌నగర్ జిల్లా📍 మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍బాపట్ల జిల్లా

వీర గాథ 5.0 విజేతగా బాపట్ల విద్యార్థిని: జాతీయ స్థాయిలో మెరిసిన కె.వెంకట రమ్య | Veera Gatha 5.0 Achievement: Bapatla Student Shines at National Level

వీర గాథ 5.0 విజేతగా బాపట్ల విద్యార్థిని: జాతీయ స్థాయిలో మెరిసిన కె.వెంకట రమ్య | Veera Gatha 5.0 Achievement: Bapatla Student Shines at National Level

బాపట్ల,జనవరి 12 : వీర గాథ 5.0 జాతీయ స్థాయిలో ప్రథమ బహుమతి సాధించిన కె.వెంకట రమ్య పాఠశాలకే కాకుండా బాపట్ల జిల్లాకు గర్వకారణమని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్ కుమార్ పేర్కొన్నారు.

సోమవారం జిల్లా కలెక్టరేట్ నందు జిల్లా కలెక్టర్ గారు కె. వెంకట రమ్యను అభినదించారు.

బాపట్ల జిల్లా, చెరుకుపల్లి మండలంలోని APRS (గర్ల్స్) వినయాశ్రమం పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న కె. వెంకట రమ్య జాతీయ స్థాయి వీర గాథ 5.0 (కవిత్వ విభాగం) పోటీలలో ప్రథమ బహుమతి (సూపర్–100) సాధించి జిల్లాకు గర్వకారణమని తెలిపారు.

వీర గాథ 5.0 కార్యక్రమంలో దేశవ్యాప్తంగా వివిధ స్థాయిలలో పోటీలు నిర్వహించగా, జాతీయ స్థాయిలో మొత్తం 100 మంది విజేతలను (సూపర్–100) ఎంపిక చేశారు. అలాగే, జాతీయ స్థాయి విజేతలను భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖ మరియు రక్షణ మంత్రిత్వ శాఖ సంయుక్తంగా 2026 జనవరి 26న రిపబ్లిక్ డే సందర్భంగా న్యూఢిల్లీలో సత్కరించనున్నారు. విజేతకు రూ.10,000/- నగదు బహుమతితో పాటు ధ్రువపత్రం అందజేయబడుతుందని.కె.వెంకట రమ్య సాధించిన సందర్భంగా పలువురు విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు అభినందనలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఇన్‌చార్జ్ జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీ శివబాబు, సమగ్ర శిక్ష అకాడమిక్ మానిటరింగ్ ఆఫీసర్ శ్రీ బి. మోసెస్, అలాగే APRS (గర్ల్స్) వినయాశ్రమం పాఠశాల ప్రిన్సిపాల్ శ్రీమతి విజయలక్ష్మి పాల్గొన్నారు.

—ఏ డి, సమాచార శాఖ,బాపట్ల జిల్లా–

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker