
విజయవాడ, అక్టోబర్ 11: రాష్ట్రవ్యాప్తంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పనిచేస్తున్న వైద్యులు విజయవాడకు చేరుకొని నిరసన దీక్ష చేపట్టారు. విజయవాడ సెంటర్ నియోజకవర్గంలోని గాంధీనగర్ ధర్నా చౌక్ వద్ద 1000 పైగా వైద్యులు రీలే నిరాహార దీక్ష కొనసాగిస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్ ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యుల సంఘం (APPHCDA) ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమంలో రాష్ట్రం నలుమూలల నుంచి వైద్యులు తరలివచ్చారు. ఈ సందర్భంగా APPHCDA రాష్ట్ర ప్రతినిధి, కోశాధికారి డా. వినోద్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ, “మేము ప్రభుత్వానికి లేదా ప్రజలకు వ్యతిరేకం కాదం. ఈ ఉద్యమం రాజకీయాలకు అతీతమైనది. మా న్యాయమైన హక్కుల కోసం జరుగుతున్న శాంతియుత పోరాటం మాత్రమే” అని స్పష్టంచేశారు.
ఇకపై ప్రభుత్వం తమ సమస్యలపై సానుకూల దృష్టితో స్పందించాలని కోరిన డా. వినోద్, తగిన పరిష్కారాలను త్వరితగతిన తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. ఈ రోజు సాయంత్రం, ధర్నా చౌక్ వద్ద కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించి వైద్యులు తమ నిరసనను తెలియజేశారు.










