
విజయవాడ, నవంబర్ 5:-విజయవాడ ఎంజీ రోడ్డులోని శ్రీ శేషసాయి కల్యాణ వేదికలో ఏర్పాటు చేసిన ‘వసంతం–2025’ చేనేత వస్త్ర ప్రదర్శనను రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ బుధవారం లాంఛనంగా ప్రారంభించారు.క్రాఫ్ట్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో ప్రతి ఏడాది నిర్వహించే ఈ వార్షిక కార్యక్రమం రెండు రోజులపాటు కొనసాగనుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్లో వివిధ రాష్ట్రాల చేనేత, చేతివృత్తుల కళాకారులు తయారు చేసిన వస్త్రాలు, హస్తకళా ఉత్పత్తులతో 70కిపైగా స్టాల్స్ను ఏర్పాటు చేశారు.
మంత్రి లోకేష్ ప్రతి స్టాల్ను సందర్శించి, ఉత్పత్తుల వివరాలను ఆరా తీశారు. ఆ తరువాత ప్రకృతి సహజ రంగులతో తయారైన ‘కొత్తూరు వసంత వర్ణ’ పేరుతో నూతన చేనేత బ్రాండ్ను ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో క్రాఫ్ట్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సెక్రటరీ ఎస్. రంజన, రాష్ట్ర క్రాఫ్ట్ కౌన్సిల్ ఎగ్జిక్యూటివ్ సభ్యులు సుజాత, సౌభాగ్యలక్ష్మి, పద్మ, శైలజ తదితరులు పాల్గొన్నారు.







