chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 మహబూబ్‌నగర్ జిల్లా📍 మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍 పల్నాడు జిల్లా

NAKARIKALLU NEWS:పత్రికా విలేకరి వేధింపులపై జిల్లా ఎస్పీకి ఫిర్యాదు- విచారణకు ఆదేశం

నరసరావుపేట, మార్చి 05: పత్రికా విలేకరి ముసుగులో అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నాడంటూ నకరికల్లు మండలానికి చెందిన ఒక విలేకరిపై బాధితులు జిల్లా పోలీసు బాస్ ద్వారానా తలుపు తట్టారు. నకరికల్లు మండల ఆంధ్రప్రభ విలేకరి తిరుమలశెట్టి నాగేశ్వరరావు (నాని) పై చర్యలు తీసుకోవాలని కోరుతూ మండలంలోని పలువురు గ్రామస్తులు, బాధితులు నరసరావుపేటలో జిల్లా ఎస్పీ కృష్ణారావును కలిసి ఫిర్యాదు చేశారు.

బెదిరింపులు.. అక్రమ వసూళ్లు!

గ్రామస్తుల కథనం ప్రకారం.. విలేకరి నాని తన హోదాను అడ్డం పెట్టుకుని నకరికల్లు మండలంలోని వ్యాపారస్తులను, ప్రభుత్వ అధికారులను నిరంతరం భయాందోళనలకు గురిచేస్తున్నాడు. చిన్నపాటి లోపాలను సాకుగా చూపి, వార్తలు రాస్తానని బెదిరిస్తూ అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్నాడని బాధితులు ఆరోపించారు.

NAKARIKALLU NEWS:పత్రికా విలేకరి వేధింపులపై జిల్లా ఎస్పీకి ఫిర్యాదు- విచారణకు ఆదేశం

పోలీసుల నిర్లక్ష్యంపై అసహనం

గతంలో ఈ వ్యవహారంపై స్థానిక నకరికల్లు పోలీసులకు పలుమార్లు ఫిర్యాదు చేసినప్పటికీ, వారు ఎటువంటి చర్యలు తీసుకోలేదని గ్రామస్తులు ఎస్పీ దృష్టికి తీసుకెళ్లారు. స్థానిక పోలీసులు పట్టించుకోకపోవడంతోనే తాము జిల్లా ఎస్పీని ఆశ్రయించాల్సి వచ్చిందని వారు తెలిపారు. విలేకరి నాని పాల్పడిన అవినీతి అక్రమాలకు సంబంధించిన కొన్ని కీలక ఆధారాలను కూడా బాధితులు ఈ సందర్భంగా ఎస్పీ కార్యాలయంలో అందజేశారు.

న్యాయం చేస్తామని ఎస్పీ హామీ

NAKARIKALLU NEWS:పత్రికా విలేకరి వేధింపులపై జిల్లా ఎస్పీకి ఫిర్యాదు- విచారణకు ఆదేశం

బాధితుల ఫిర్యాదును స్వీకరించిన జిల్లా ఎస్పీ కృష్ణారావు, ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి నివేదిక సమర్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. చట్టం ముందు ఎవరూ అతితీతులు కారని, తప్పు చేసినట్లు తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన బాధితులకు హామీ ఇచ్చారు.Palnadu district Telugu local news: పల్నాడు జిల్లా తెలుగు లోకల్ న్యూస్


ముఖ్య అంశాలు:

  • నిందితుడు: తిరుమలశెట్టి నాగేశ్వరరావు (నాని), ఆంధ్రప్రభ విలేకరి.
  • ఆరోపణ: అధికారుల, వ్యాపారస్తుల బెదిరింపులు, అక్రమ వసూళ్లు.
  • ప్రధాన ఫిర్యాదు: జిల్లా ఎస్పీ కృష్ణారావుకు అందజేత.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker