ఆంధ్రప్రదేశ్గుంటూరు
Village and ward secretariat employees staged a protest demanding solutions to their problems.
సమస్యల పరిష్కారం కోరుతూ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. ఈ మేరకు కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి గ్రీవెన్స్ లో అధికారులకు వినతిపత్రం సమర్పించారు. జీవో నెంబర్ 5 ను తక్షణమే సవరించాలని ఈ సందర్భంగా సచివాలయ ఉద్యోగుల సంఘం ప్రతినిధులు అనురాధ, ధనలక్ష్మి డిమాండ్ చేశారు. పదోన్నతులు కల్పించిన అనంతరమే బదిలీలు చేయాలని చెప్పారు. వార్డు టు వార్డు బదిలీ ప్రక్రియను అమలు చేయాలని సూచించారు. లేని పక్షంలో నిరంతరం ఆందోళనలు కొనసాగిస్తామన్నారు.