chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 మహబూబ్‌నగర్ జిల్లా📍 మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍 విశాఖపట్నం జిల్లా

Visakha local News :విశాఖ ఉత్సవ్‌లో ఉత్సాహంగా బోట్ రేస్ పోటీలు

విశాఖపట్టణం, జనవరి 29:-విశాఖ ఉత్సవ్‌లో భాగంగా మంగమారిపేట వద్ద నిర్వహించిన బోట్ రేస్ పోటీలు సందడి వాతావరణంలో సాగాయి. భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్‌తో కలిసి జెండా ఊపి పోటీలను ప్రారంభించారు.

Visakha local News :విశాఖ ఉత్సవ్‌లో ఉత్సాహంగా బోట్ రేస్ పోటీలు

సమీప గ్రామాలకు చెందిన మత్స్యకారులు పోటీల్లో పాల్గొని తమ నైపుణ్యాన్ని ప్రదర్శించారు. ఉత్సవ్ షెడ్యూల్‌లో భాగంగా గురువారం మధ్యాహ్నం 2 గంటలకు నాన్‌ మెకనైజ్డ్ బోట్ల రేస్ చిప్పాడ ఉప్పుగల్లి తీరం నుంచి ప్రారంభమై భీమిలి జోనల్ కార్యాలయం తీరం వరకు సుమారు 2 కిలోమీటర్ల మేర కొనసాగింది. మధ్యాహ్నం 3 గంటల అనంతరం మంగమారిపేట వద్ద మెకనైజ్డ్ బోట్ల రేస్ ప్రారంభమై భీమిలి వరకు సుమారు 6 కిలోమీటర్ల మేర సాగింది.

Visakha local News :విశాఖ ఉత్సవ్‌లో ఉత్సాహంగా బోట్ రేస్ పోటీలు

ప్రతి విభాగంలో 15 బోట్లు పాల్గొనగా, ఒక్కో బోట్లో ముగ్గురేసి చొప్పున మొత్తం 90 మంది మత్స్యకారులు పోటీల్లో భాగస్వామ్యులయ్యారు. పోటీలను వీక్షించేందుకు భీమిలి తీరానికి పెద్ద సంఖ్యలో ప్రజలు, పర్యాటకులు తరలివచ్చారు.

ఈ పోటీలను మత్స్యశాఖ, టూరిజం, క్రీడాశాఖలు సంయుక్తంగా నిర్వహించాయి. కార్యక్రమంలో భీమిలి ఆర్డీవో సంగీత్ మాధుర్, మత్స్యశాఖ జేడీ లక్ష్మణరావు, టూరిజం అధికారిణి మాధవి, క్రీడా అధికారిణి జూన్ గ్యాలియెట్, తహశీల్దార్ రామారావు, జోనల్ కమిషనర్, మత్స్యకార సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

Visakha local News :విశాఖ ఉత్సవ్‌లో ఉత్సాహంగా బోట్ రేస్ పోటీలు

విజేతలు వీరే
మెకనైజ్డ్ బోట్ రేసులో సీరం లక్ష్మణ్ ప్రథమ స్థానంలో నిలవగా, సీరం గణేష్ ద్వితీయ, గిరికిన రాజేష్ తృతీయ స్థానాల్లో నిలిచారు. నాన్‌ మెకనైజ్డ్ బోట్ రేసులో కాసారపు చిన పైడిరాజు ప్రథమ, కాసారపు ధనరాజ్ ద్వితీయ, కాసారపు పేర్రాజులు తృతీయ స్థానాల్లో నిలిచినట్లు మత్స్యశాఖ అధికారులు తెలిపారు.Visakha Local News :ఆర్కే బీచ్ కేంద్రంగా విశాఖ ఉత్సవాల సందడి

రెండు విభాగాల విజేతలకు ఈ నెల 31వ తేదీన ఆర్కే బీచ్ ప్రధాన వేదిక వద్ద జరిగే విశాఖ ఉత్సవ్ ముగింపు వేడుకల్లో బహుమతులు అందజేయనున్నట్లు అధికారులు వెల్లడించారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker