chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్అమరావతి

Amaravathi Local News :విఐటి–ఏపి విశ్వవిద్యాలయంలో జెన్ జెడ్ తపాలా కార్యాలయం ప్రారంభం

Amaravathi:- డిసెంబర్ 20, 2025:-విఐటి–ఏపి విశ్వవిద్యాలయంలో నూతన జెన్ జెడ్ తపాలా కార్యాలయాన్ని భారత తపాలా శాఖ ఆధ్వర్యంలో శనివారం ఏర్పాటు చేశారు. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూడవ జెన్ జెడ్ తపాలా కార్యాలయంగా నిలిచింది.

ఈ కార్యాలయాన్ని కేంద్ర గ్రామీణాభివృద్ధి, సమాచార శాఖల సహాయ మంత్రి డా. పెమ్మసాని చంద్రశేఖర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భారతదేశంలో అతిపెద్ద మరియు విశ్వసనీయ సంస్థలలో తపాలా శాఖ ఒకటని, ప్రజలకు అందిస్తున్న సేవలు మరువలేనివని పేర్కొన్నారు.

Amaravathi Local News :విఐటి–ఏపి విశ్వవిద్యాలయంలో జెన్ జెడ్ తపాలా కార్యాలయం ప్రారంభం

యువతను ఆకర్షించే లక్ష్యంతో దేశవ్యాప్తంగా పైలట్ ప్రాజెక్ట్‌గా 50 నుంచి 60 జెన్ జెడ్ తపాలా కార్యాలయాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అందులో ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లో మూడు కార్యాలయాలు ప్రారంభమవడం గర్వకారణమని, వాటిలో ఒకటి విఐటి–ఏపి విశ్వవిద్యాలయంలో ఏర్పాటు కావడం ఆనందంగా ఉందని అన్నారు. విద్యార్థులు ఈ ఆధునిక సదుపాయాలను పూర్తిగా వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు.

Amaravathi Local News :విఐటి–ఏపి విశ్వవిద్యాలయంలో జెన్ జెడ్ తపాలా కార్యాలయం ప్రారంభం

ఈ సందర్భంగా విఐటి–ఏపి విశ్వవిద్యాలయంలో తపాలా శాఖ నిర్వహించిన ఈ-కామర్స్ హ్యాకతాన్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు మంత్రి సర్టిఫికెట్లు అందజేశారుAmaravathi Local News :పూర్వోదయ పథకంతో ఏపీకి ఉషోదయం-సీఎం చంద్రబాబు.

ఈ కార్యక్రమంలో గుంటూరు జిల్లా కలెక్టర్ శ్రీమతి తమీమ్ అన్సారీయా, ఆంధ్రప్రదేశ్ చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ బి.పి. శ్రీదేవి, విజయవాడ పోస్ట్ మాస్టర్ జనరల్ డా. వెన్నం ఉపేందర్, విఐటి–ఏపి విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్ (ఇన్‌చార్జ్) డా. పి. అరుల్మోళివర్మన్, రిజిస్ట్రార్ డా. జగదీష్ చంద్ర ముదిగంటి, తపాలా శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker