chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 మహబూబ్‌నగర్ జిల్లా📍 మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍బాపట్ల జిల్లా

CIRALA LOCAL NEWS:వివక్ష లేని సమాజం కోసం సావిత్రిబాయి బాటలో నడుద్దాం!

  • చీరాలలో ఘనంగా సావిత్రిబాయి పూలే వర్ధంతి
  • నివాళులర్పించిన ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య, యువనేత గౌరీ అమర్నాథ్
  • తొలితరం మహిళా ఉపాధ్యాయురాలి సేవలు చిరస్మరణీయం

చీరాల: భారతదేశ చరిత్రలో అణచివేతకు వ్యతిరేకంగా, వివక్ష లేని సమాజం కోసం అక్షరాన్నే ఆయుధంగా మలిచిన తొలితరం విప్లవకారిణి, దేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే వర్ధంతి సభ చీరాలలో ఘనంగా జరిగింది. స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన ఈ కార్యక్రమంలో చీరాల శాసనసభ్యులు శ్రీ మద్దులూరి మాలకొండయ్య, యువ నాయకులు శ్రీ మద్దులూరి గౌరీ అమర్నాథ్, మరియు ఇతర కూటమి నాయకులు పాల్గొని ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ.. కేవలం ఒక ఉపాధ్యాయురాలిగా మాత్రమే కాకుండా, మనువాద పితృస్వామ్య భావజాలాన్ని ధిక్కరించిన సామాజిక యోధురాలిగా సావిత్రిబాయి చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయారని కొనియాడారు. సమాజంలోని కుళ్లును కడిగేయడానికి ఆమె చేసిన పోరాటాన్ని గుర్తుచేసుకున్నారు.

CIRALA LOCAL NEWS:వివక్ష లేని సమాజం కోసం సావిత్రిబాయి బాటలో నడుద్దాం!

సావిత్రిబాయి పూలే స్ఫూర్తిదాయక ప్రస్థానం:

  • జననం – విద్యాభ్యాసం: 1831, జనవరి 3న మహారాష్ట్రలోని సతారా జిల్లా, నైగావ్‌లో జన్మించిన సావిత్రిబాయికి 9 ఏళ్ల వయసులోనే జ్యోతిరావు పూలేతో వివాహం జరిగింది. భర్త ప్రోత్సాహంతోనే ఆమె అక్షరాభ్యాసం చేసి జ్ఞానాన్ని సముపార్జించారు.
  • తొలి మహిళా ఉపాధ్యాయురాలు: 1848లో పూణేలో మొట్టమొదటి బాలికల పాఠశాలను ప్రారంభించి చరిత్ర సృష్టించారు. అగ్రవర్ణ అహంకారులు ఆమెపై బురద, పేడ, రాళ్లు విసిరినా వెరవకుండా, తన వెంట మరో అదనపు చీరను తీసుకెళ్లి మరీ అణగారిన వర్గాలకు విద్యాబోధన చేశారు.
  • సామాజిక సంస్కరణలు: అంటరానితనం పేరిట విద్యకు దూరమైన దళిత, శూద్ర వర్గాల కోసం విద్యా సంస్థలను స్థాపించారు. పురోహితులు లేని వివాహాలను ప్రోత్సహించారు. వితంతువుల తలనీలాల అనాచారానికి వ్యతిరేకంగా మంగలి వారితో సమ్మె చేయించారు. గర్భం దాల్చిన వితంతువుల కోసం ‘బాలహత్యా ప్రతిబంధక గృహం’ స్థాపించారు. కరువు కాలంలో కులమతాలకు అతీతంగా వేలమందికి అన్నదానం చేశారు.
  • అక్షర యోధురాలు: “చదువుకోకపోవడం అంటే పశువుగా మిగిలిపోవడమే.. స్త్రీ విద్యే సమాజ ప్రగతికి అసలైన సోపానం” అని చాటిన గొప్ప కవయిత్రి ఆమె. అగ్రవర్ణాల గుత్తాధిపత్యంలో ఉన్న విద్యకు ప్రత్యామ్నాయంగా, ఇంగ్లీష్ విద్యను అభ్యసించి బానిస సంకెళ్లు తెంచుకోవాలని ఆనాడే పిలుపునిచ్చారు.
CIRALA LOCAL NEWS:వివక్ష లేని సమాజం కోసం సావిత్రిబాయి బాటలో నడుద్దాం!

సేవలోనే తుదిశ్వాస.. 1897లో పూణేలో ప్లేగ్ వ్యాధి ప్రబలినప్పుడు ఆమె ప్రాణాలకు తెగించి రోగులకు సేవ చేశారు. ఒక ప్లేగ్ బాధితుడైన బాలుడిని భుజంపై వేసుకుని ఆసుపత్రికి తీసుకెళ్తున్న క్రమంలో ఆమెకు కూడా ఆ వ్యాధి సోకింది. రోగులకు సేవచేస్తూనే 1897, మార్చి 10న ఈ అక్షర విప్లవ మూర్తి కన్నుమూశారు. మనువాద, పెట్టుబడిదారీ భావజాలాలకు అతీతంగా, మనిషిని మనిషిగా గుర్తించే సోషలిస్టు సమాజం కోసం ప్రజలను చైతన్యవంతం చేయడమే సావిత్రిబాయికి మనం ఇచ్చే నిజమైన నివాళి అని నాయకులు పిలుపునిచ్చారు. అసమానతలపై ఆమె చూపిన బాటలో పోరాడటమే నేటి తక్షణ అవసరమని స్పష్టం చేశారు.bapatla news

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker