తుళ్ళూరు మండలం వెంకటపాలెం గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయ ప్రాంగణంలో శనివారం శ్రీ శ్రీనివాస కళ్యాణోత్సవం జరగనుంది. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాజరు కానున్న నేపధ్యంలో అక్కడి ఏర్పాట్లను శుక్రవారం తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వాహణాధికారి జె శ్యామలరావు, జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి, సంయుక్త కలెక్టర్ ఏ.భార్గవ్ తేజ, ,జిల్లా ఎస్పీ సతీష్ కుమార్, అసిస్టెంట్ కలెక్టర్ పోవార్ స్వప్నిల్ జగన్నాధ్, ముఖ్యమంత్రి భద్రత సిబ్బందితో కలిసి పరిశీలించారు. దేవస్థానం ఆవరణలో శ్రీనివాస కళ్యాణోత్సవం నిర్వహించే సభా వేదిక వద్ద గ్యాలరీలు క్యూలైన్ల ఏర్పాట్లు, భక్తులకు ప్రసాద వితరణ కేంద్రం వద్ద ఏర్పాట్లు, వాహనాల పార్కింగ్ ప్రదేశాలు, బందోబస్తు తదితర అంశాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ శ్రీనివాసులు, ఆర్టీసీ ఆర్ఎం రవికాంత్, పిడి డిఆర్డిఏ టి.వి.విజయలక్ష్మి, డిఎస్ఓ కోమలి పద్మ, డిఎంఅండ్ హెచ్ ఓ డా. విజయలక్ష్మి, జిల్లా పంచాయతీ రాజ్ అధికారి సాయి కుమార్, రవాణా శాఖ అధికారులు, సంబంధిత శాఖల ప్రభుత్వ అధికారులు, తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు పాల్గొన్నారు.
Read Next
4 hours ago
గుంటూరు క్రైమ్ న్యూస్ భార్యని చంపిన భర్త….
4 hours ago
‘యువత పోరు’లో పెద్ద ఎత్తున యువతరం పాల్గొనాలి-వైసీపీ నేతలు
4 hours ago
గుడివాడ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో జీవన్ రద్ అడ్వాన్సుడ్ మొబైల్ బస్సును ప్రారంభించిన…ఎంపీ వల్లభనేని బాలసౌరి, ఎమ్మెల్యే వెనిగండ్ల
With Product You Purchase
Subscribe to our mailing list to get the new updates!
Lorem ipsum dolor sit amet, consectetur.
Related Articles
Check Also
Close
-
ఫిరంగిపురంలో ఘనంగా యోగా దినోత్సవం7 hours ago