chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 మహబూబ్‌నగర్ జిల్లా📍 మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍గుంటూరు జిల్లా

GUNTUR LOCAL NEWS:ఓటర్ల మ్యాపింగ్‌లో నిర్లక్ష్యం వద్దు- నగర కమిషనర్ కె. మయూర్ అశోక్ హెచ్చరిక

గుంటూరు: ఓటర్ల జాబితా ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (SIR)లో భాగంగా గుంటూరు తూర్పు (95), పశ్చిమ (94) నియోజకవర్గాల్లో ఎలక్ట్రోల్ మ్యాపింగ్‌ను రానున్న రెండు వారాల్లోగా పూర్తి చేయాలని నగర కమిషనర్ మరియు తూర్పు నియోజకవర్గ ఈఆర్ఓ కె. మయూర్ అశోక్ అధికారులను ఆదేశించారు. మంగళవారం జీఎంసీ ప్రధాన కార్యాలయంలోని కౌన్సిల్ హాల్‌లో బీఎల్ఓలు, సూపర్వైజరీ అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు.

మ్యాపింగ్ పురోగతిపై అసహనం

నగరంలోని రెండు నియోజకవర్గాల్లో మ్యాపింగ్ ప్రక్రియ కేవలం 55 శాతం మాత్రమే పూర్తి కావడంపై కమిషనర్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం ఈ ప్రక్రియపై అత్యంత ప్రత్యేక దృష్టి సారించిందని, బీఎల్ఓలు ప్రతి ఇంటికీ వెళ్లి నిర్దేశిత మార్గదర్శకాల ప్రకారం మ్యాపింగ్/ప్రోజేనీ పూర్తి చేయాలని స్పష్టం చేశారు. ప్రతి బీఎల్ఓ కనీసం 80 శాతం మ్యాపింగ్ లక్ష్యాన్ని చేరుకోవాలని, విధుల్లో నిర్లక్ష్యం వహించే వారిపై ఎన్నికల సంఘం నిబంధనల మేరకు కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

GUNTUR LOCAL NEWS:ఓటర్ల మ్యాపింగ్‌లో నిర్లక్ష్యం వద్దు- నగర కమిషనర్ కె. మయూర్ అశోక్ హెచ్చరిక

క్షేత్రస్థాయి పర్యవేక్షణకు ఆదేశం

సూపర్వైజరీ అధికారులు క్షేత్రస్థాయిలో ఉండి మ్యాపింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలని, మ్యాపింగ్ ఖచ్చితత్వాన్ని తాము కూడా ఆకస్మిక తనిఖీలు చేస్తామని కమిషనర్ తెలిపారు. ప్రతిరోజూ బీఎల్ఓల వారీగా ప్రగతి నివేదికలను అందజేయాలని ఎలక్షన్ సెల్ సూపరింటెండెంట్‌ను ఆదేశించారు. ఈ సమావేశంలో గుంటూరు పశ్చిమ ఈఆర్ఓ మరియు అదనపు కమిషనర్ చల్లా ఓబులేసు, ఏఈఆర్ఓ సూరజ్ కుమార్, ఎలక్షన్ సెల్ సూపరింటెండెంట్ బాలాజీ బాష తదితరులు పాల్గొన్నారు.http://GUNTUR NEWS

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker