
తెనాలి (గుంటూరు జిల్లా): శ్రీ పరాభవ నామ ఉగాది పండుగను పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం అందించే ప్రతిష్టాత్మక ‘కళారత్న’, ‘ఉగాది పురస్కారాల’ మెమెంటోలను తెనాలికి చెందిన ప్రముఖ శిల్పులు కాటూరి వెంకటేశ్వరరావు, రవిచంద్ర అత్యద్భుతంగా రూపొందించారు. మంగళవారం కాటూరి ఆర్ట్ గ్యాలరీలో ప్రదర్శనకు ఉంచిన ఈ మెమెంటోలను తెనాలి తహసీల్దార్ గోపాలకృష్ణ సందర్శించి, శిల్పుల పనితీరును ప్రత్యేకంగా అభినందించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత రెండేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వ పురస్కారాలను తెనాలి శిల్పులే తయారు చేయడం పట్టణానికి గర్వకారణమని కొనియాడారు. విజయవాడలోని స్వరాజ్ మైదాన్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కళావేదికలో జరగనున్న ఉగాది వేడుకల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా వివిధ రంగాల ప్రముఖులకు ఈ పురస్కారాలను అందజేయనున్నారు.http://GUNTUR NEWS







