Ward Secretariat employees’ agitation
గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు బదిలీల కొరకై GO నెంబరు 5 ను ప్రభుత్వం తీసుకువచ్చింది. ఈ జీవోలో సొంత మండలంలో ఏ ఉద్యోగి కి పోస్టింగ్ ఇవ్వరాదు అనే నిబంధన ఉన్నది . అందువల్ల పట్టణ ప్రాంతంలో మరియు ఆ పట్టణ రెవెన్యూ మండల రూరల్ లో నివసించే వార్డు సచివాలయ ఉద్యోగి అర్బన్ లో ఎప్పటికీ ఉద్యోగం చేసే అవకాశం లేదు కాబట్టి ఎంతో ఆందోళన చెందారు. కాబట్టి ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మున్సిపాలిటీ సచివాలయ ఉద్యోగులందరూ సోమవారం మధ్యాహ్నం నల్ల బ్యాడ్జీలతో నిరసన చేసి వినతి పత్రాన్ని మండల డిప్యూటీ తాహిసిల్దార్ కి అందించారు.
ఈ సందర్బంగా ప్రభుత్వం పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసుకునే ఏ ఉద్యోగికి లేని ఇటువంటి నిబంధనలను చిరు ఉద్యోగులమైన మాపై రుద్దటం పిచ్చుకల మీద బ్రహ్మాస్త్రం మాదిరిగా ఉందని ఎంతో బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. కాబట్టి ప్రభుత్వం జీవో నెంబర్ 5 ను సవరించి పట్టణాల్లో సొంత వార్డు కాకుండా,
సచివాలయం టు సచివాలయం ట్రాన్స్ఫర్ కు అవకాశం ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు.
ఈ కార్యక్రమంలో జగ్గయ్యపేట పట్టణ 14 వార్డు సచివాలయంల ఉద్యోగులందరూ పాల్గొన్నా